కాంగ్రెస్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ హీట్ రేపుతున్న వేళ సీనియర్ నేత మధుయాష్కీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ పాలసీలు నచ్చి రాలేదని హాట్ కామెంట్స్ చేశారు. వారి అక్రమాస్తులు కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్ కాపాడుకునేందుకు మాత్రమే కాంగ్రెస్లో చేరారని.. కాంగ్రెస్పై ప్రేమతో కాదన్నారు మధుయాష్కీ. ఎమ్మెల్యేలు చేరిన చోటల్లా వారికి పార్టీని రాసివ్వలేదన్నారు. జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో గంగారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ లక్ష్మణ్ తో కలిసి పరామర్శించారు మధుయాష్కి. గంగారెడ్డి అతి దారుణంగా హత్యకి గురికావడం బాధకరమన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొన్న వ్యక్తి గంగారెడ్డి అని తనకి ప్రాణహాని ఉందని పోలీసులకి చెప్పుకున్నారని వెల్లడించారు. ప్రాణానికి ముప్పు ఉందని చెప్పిన పోలిసులు ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90068