మడకశిర (Madakasira) లో టిడిపి వర్గపోరు ఈరోజు తారాస్థాయికి చేరింది. మడకశిరలో టిడిపి రెబల్ అభ్యర్థి సునీల్ కుమార్ వర్గీయులు. మడకశిర టిడిపి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజుకు బీఫామ్ రావడంతో మడకశిర ఆత్మీయ సమావేశానికి విచ్చేస్తున్న ఎంఎస్ రాజు, హిందూపురం టిడిపి పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి కారులో వస్తుండగా మడకశిర పట్టణంలో వారి కార్లపై రాళ్లతో దాడి చేసారు. టిడిపి వర్గాలు నాలుగు కార్లు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసారు. ఈరోజు మడకశిర టిడిపి రెబల్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో వీరు అటుగా రావడంతో కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా కంగు తిన్న ఎమ్మెస్ రాజు, పార్థసారతులను తరిమికొట్టగా కారులో వెనుతిరిగి వెళ్ళిపోయారు. వారి కారు అద్దాలను రాళ్లతో చెప్పులతో దాడి చేసి పగలగొట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన వారిని బెదరగొట్టారు. మడకశిరలో టిడిపి వర్గపోరు ఈరోజు తారాస్థాయికి చేరింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా జులై 1 నుంచి 5 రోజుల పాటు నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పలు కీలక ప్రాజెక్టులకు…
- పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భూమి, పశుసంపద, ప్రకృతిని అనుసంధానం చేసే గొప్ప సంప్రదాయమే ఏరువాక పండుగ అని…
- అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.ఏరువాక పున్నమిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల…





Total views : 180908