మడకశిర (Madakasira) లో టిడిపి వర్గపోరు ఈరోజు తారాస్థాయికి చేరింది. మడకశిరలో టిడిపి రెబల్ అభ్యర్థి సునీల్ కుమార్ వర్గీయులు. మడకశిర టిడిపి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజుకు బీఫామ్ రావడంతో మడకశిర ఆత్మీయ సమావేశానికి విచ్చేస్తున్న ఎంఎస్ రాజు, హిందూపురం టిడిపి పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి కారులో వస్తుండగా మడకశిర పట్టణంలో వారి కార్లపై రాళ్లతో దాడి చేసారు. టిడిపి వర్గాలు నాలుగు కార్లు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసారు. ఈరోజు మడకశిర టిడిపి రెబల్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో వీరు అటుగా రావడంతో కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా కంగు తిన్న ఎమ్మెస్ రాజు, పార్థసారతులను తరిమికొట్టగా కారులో వెనుతిరిగి వెళ్ళిపోయారు. వారి కారు అద్దాలను రాళ్లతో చెప్పులతో దాడి చేసి పగలగొట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన వారిని బెదరగొట్టారు. మడకశిరలో టిడిపి వర్గపోరు ఈరోజు తారాస్థాయికి చేరింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం దూసుకెళుతోందని, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్…
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ.. వీఎంఆర్డీఏ, పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. పెదరాంబద్రపురం, నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో…
- తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మారిస్పేట కాలువ కట్ట వద్ద ఉన్న ‘సూర్య శిల్పశాల’లో ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎంతో శ్రమించి తయారు చేసిన అనేక విలువైన…






Total views : 75238