మడకశిర (Madakasira) లో టిడిపి వర్గపోరు ఈరోజు తారాస్థాయికి చేరింది. మడకశిరలో టిడిపి రెబల్ అభ్యర్థి సునీల్ కుమార్ వర్గీయులు. మడకశిర టిడిపి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజుకు బీఫామ్ రావడంతో మడకశిర ఆత్మీయ సమావేశానికి విచ్చేస్తున్న ఎంఎస్ రాజు, హిందూపురం టిడిపి పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి కారులో వస్తుండగా మడకశిర పట్టణంలో వారి కార్లపై రాళ్లతో దాడి చేసారు. టిడిపి వర్గాలు నాలుగు కార్లు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసారు. ఈరోజు మడకశిర టిడిపి రెబల్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో వీరు అటుగా రావడంతో కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా కంగు తిన్న ఎమ్మెస్ రాజు, పార్థసారతులను తరిమికొట్టగా కారులో వెనుతిరిగి వెళ్ళిపోయారు. వారి కారు అద్దాలను రాళ్లతో చెప్పులతో దాడి చేసి పగలగొట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన వారిని బెదరగొట్టారు. మడకశిరలో టిడిపి వర్గపోరు ఈరోజు తారాస్థాయికి చేరింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
- విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను…