అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని ఊటుకూరు, గుండ్లూరు, హెచ్ చెర్లోపల్లి, హస్తవరం గ్రామాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అదే విధంగా దిగువ మందపల్లి, తాళ్లపాక, మన్నూరు, పోలి గ్రామాల్లో జరిగిన నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అన్నిచోట్ల కూటమి అభ్యర్థులు హవా కొనసాగించారు. నందలూరు మండలంలో 13 గ్రామాల్లో జరిగిన ఎన్నికలు, పుల్లంపేట మండలంలో 12 గ్రామాల్లో జరిగిన ఎన్నికలు, పెనగలూరు మండలంలో 15 గ్రామాల్లో కూడా ప్రశాంతంగా జరిగాయి. ఈ నాలుగు మండలాల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. ఏ ఎన్నికల బూతులో కూడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని బూతుల్లో చెదురు, ముదురు సంఘటనలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, కూటమి అభ్యర్థులు సమన్వయంతో వ్యవహరించి, రాజీ పడినట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరిగిన అన్నిచోట్ల కూడా తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీతృణమూల్ కాంగ్రెస్పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
- ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
- ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
- మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి…
- రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 33571