రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు, జార్ఖండ్లో 38 స్థానాలకు రేపు జరిగే ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది.
జార్ఖండ్లో ఆల్రెడీ ఒక దశ ఎన్నికలు పూర్తికాగా.. రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో రేపు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల ఫలితాలు నవంబర్ 23న వస్తాయి.ఈసారి ఈ రెండు రాష్ట్రాలతోపాటూ.. మరో 11 రాష్ట్రాల్లోని 33 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. వాటికి కూడా ఫలితాలు నవంబర్ 23నే రానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్ని ఏడు విడతల్లో అద్భుతంగా ముగించింది. అదే విధంగా.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు కూడా ఏర్పాట్లు బాగానే చేసింది. సెక్యూరిటీ విషయంలోనూ వెనక్కి తగ్గట్లేదు. పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేశాయి కాబట్టి గెలుపు ఎవరిది అన్నది ఆసక్తిగా మారింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చేనెలలో భారత్కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్కు వచ్చిన షీ జిన్పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి