తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పదేళ్లు కేసీఆర్కు అవకాశం ఇస్తే.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు. వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై లేదా? భారాసకు మరో అవకాశం ఇచ్చే విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Revanth Reddy
రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కు టీపీపీసీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొరల గడీ ల పాలన వల్ల మన నల్లమల ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదని.. నిరుద్యోగ సమస్య తో యువతకు అన్యాయం చేశారనీ, కాంగ్రెస్ పార్టీ వస్తె రైతుభందు అని కెసిఆర్ తప్పుడు కూతలు కూస్తున్నాడని ధ్వజమెత్తారు.గువ్వల బాలరాజు ను మా అచ్చంపేట బిడ్డలు ఒక్క ఖాన్ భైరీ కొడితే పోయి గోపాల్ పేటలో పడాలి బిడ్డా ..గుండాయిజం అంతం అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు, ఈ ఒక్క నెల ఆగితే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని వృద్దలకు 4000 ఆసరా పించన్ , మహిళకు, 2500 రూపాయలు, కౌలురైతులకు 12000, రైతులకు 15000 రూపాయలు ఇస్తామని, తెలిపారు, చీమల దండు లాగా సభకు వస్తు మీ ఉత్సాహం చూస్తుంటే వంశీకృష్ణ కు యాభై వేయిల మెజారిటీ విజయఢంకా మోగించి ఆశీర్వదిస్తున్నరు అని అన్నారు, అదేవిధంగా డిసెంబర్ 9 తేదీన హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి నా అచ్చంపేట ప్రజలు ఇదే ఆహ్వానం గా అందుకుని రావాలని పిలపునిచ్చారు, ఇదే క్రమంలో ఇంటెలిజెన్స్ పోలీసులను ఈ భారీ బహిరంగ సభ వీడియో లను చిత్రీకరించి కేసిఆర్ కు పంపడని సూచించారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పదేళ్లు కేసీఆర్కు అవకాశం ఇస్తే.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు. వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై లేదా? భారాసకు మరో అవకాశం ఇచ్చే విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్లయిందని, ఈ సమయంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నర్సాపూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో రేవంత్ పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే రైతుల ఆత్మహత్యలు కలిచివేశాయన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారన్నారు. వచ్చే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పరకాల పట్టణ శివారులో కాకతీయ థియేటర్ ఎదురుగ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు రానున్నారు. ఈ బహిరంగ సభకు దాదాపు 2లక్షల పై చిలుకు జనాలు రానున్నారని అంచనా వేస్తున్నారు. లలిత కన్వెన్షన్ హాల్ గ్రౌండ్ లో హెలిపాడ్ ల్యాండ్ అయిన తరువాత కాన్వాయ్ లో రోడ్ షో ద్వారా సభాస్థలికి చేరుకొనున్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.2వేల పింఛను ఇస్తున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాను అని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కాకూడదు. తెలివితో ఓటు వేస్తేనే తెలివైన ప్రభుత్వం వస్తుందన్నారు. రాష్ట్రం తలరాతను మార్చే ఓటును వివేకంతో వేయాలన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపి 58 ఏళ్లు గోస పెట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్ఎస్ గెలిస్తే.. పింఛన్లు క్రమంగా రూ.5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సంపద పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నామన్నారు. జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిస్తే రైతు బంధు రూ.16వేలు వస్తాయన్నారు. అదే కాంగ్రెస్ వాళ్లు గెలిస్తే ఉన్న రైతు బంధు కూడా పోతుందని, ఇవన్నీ ప్రజలు గమనించాలని కేసీఆర్ కోరారు. నన్ను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయన్నారు. రాష్ట్రానికే పరిమితం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేనిఫెస్టో గ్యారింటీలను అభయహస్తం ద్వారా తెలంగాణ సమాజానికి అంకితం చేస్తున్నామన్నారు. అహంకారపూరితమైన పాలనను తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు చవి చూశారన్నారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్ట ఉన్నదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందన్నారు. తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ తుఫాన్ వీయబోతుందని, సునామీ సృష్టించబోతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ప్రజల జీవితాలలో వెలుగు నింపేందుకు మనస్పూర్తిగా ఈ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Read Also..
Read Also..
తెలంగాణలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటామన్నారు. బీఆర్ఎస్ నేతలు మేడ్చల్కు ఐటీ పార్క్ తీసుకువస్తామని చెప్పారని, కానీ ఏమయిందో చెప్పాలన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు అంశంపై కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకువచ్చినా తరలించలేదన్నారు.
సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు గోడమీద రాత అని, కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయం అయిందని తెలిసి, సీఎం కేసీఆర్ మళ్లీ గజ్వేల్ కు పోతున్నారన్నారు. గజ్వేల్ లో సైతం కేసీఆర్ ఓటమి ఖాయమైనని, రానున్న రోజుల్లో ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తారో వేచి చూడాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఇప్పటికైనా తెలుసుకున్నారని, తెలంగాణ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారన్నారు.
రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు. కేసీఆర్ సీఎం, రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితిపై మండిపడ్డారు. ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే, ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అన్నారు. కేసీఆర్ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి, మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు.





Total views : 91059