ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండల పరిధిలోని అటవీ, రెవెన్యూ భూముల్లో పలువురు దళారులు ఇష్టానుసారంగా మట్టి, కంకర తవ్వకాలను చేపడుతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ తంతు ప్రతిరోజూ కొనసాగుతోంది. కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి దళారులు అక్రమంగా గండికొడుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటంపై పలువురు మండిపడుతున్నారు. ఇండ్లు కట్టుకునే వారికి మట్టి, కంకరతో అవసరం ఉంటుంది. దీంతో అధికారులతో కుమ్మక్కైన దళారులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు కూడా దళారులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి వారికి సహకరిస్తున్నారు. పుట్రెల గ్రామంలో కోటిపల్లి నుండి పక్క మండలాలకు టిప్పర్ల, ట్రాక్టర్లు ద్వారా మట్టి, కంకర తరలిస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.
నరసాపురం గ్రామంలోని అటవీ ప్రాంతం నుంచి మట్టిని తరలిస్తున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవటంతో వారి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటవీ భూముల్లో లెవెల్ ట్రాక్టర్ పెడితేనే అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకుంటారు.. అలాంటిది ఇప్పుడు ఏకంగా తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోవట్లేదు. దీంతో వారికి ఎంత మేర ముట్టిందో దీనిబట్టే అర్థమవుతోంది. దీనిపై అధికారులను ప్రశ్నించే వారి పేర్లు, ఫోన్ నెంబర్లు సదరు దళారులకు ఇస్తూండటంతో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళారుల దందాకు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఆయన అగ్నిమాపకశాఖ, సీఐడీ విభాగాల్లో విధులు నిర్వర్తించారు. సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై ప్రభుత్వం రాతపూర్వక వివరణ కోరగా సంజయ్ ఇవ్వలేదు. దీంతో ఆయనపై…
- ఏపీ లోకాయుక్త జస్టిస్గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం.ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. ఏపీ లోకాయుక్తగా…
- డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్ట్.కెనడాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. కెనడా, అమెరికాలతో సరిహద్దు పంచుకుంటున్న ‘లేక్ ఆంటారియో’ పేరును ‘లేక్ అమెరికా’గా మార్చే ప్రతిపాదనను సీరియస్గా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము…
- ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష బరిలో బండ్ల గణేష్.తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నామినేషన్ దాఖలు చేశారు.ఆయనతో పాటు మరో నిర్మాత సి. కళ్యాణ్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈసారి జరగబోతున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.దిల్…
- విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.మహిళల ఏపీ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ ఆక్షన్కు సర్వం సిద్ధమైంది. విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ వేలం జరగనుంది. వేలంలో 191 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మేటి ఆటగాళ్ల కోసం నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి