sports news
హైదరాబాద్, ఉప్పల్ పీస్ పరిధి పరిసర ప్రాంతాల్లో 100కు పైగా సైకిళ్లు ఇతర సామాగ్రి చోరి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇళ్లలోకి దర్జాగా గేటు తీసుకొని ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు. దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరలొ రికార్డ్ అయ్యాయి. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు.
ఏలూరు, దెందులూరు(Dendulur)లో నేడు సిద్దం బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్. సిద్దం సభ(Siddam Sabha)కు భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ శ్రేణులు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న సభ. సీఎం జగన్మోహన్ రెడ్డితోపాటు సభకు హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుండి లక్షలాదిగా హాజరుకానున్న పార్టీ శ్రేణులు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మరొకసారి అధికారం చేపట్టేందుకు కార్యకర్తలకు సిద్ధం సభ ద్వారా దిశ నిర్దేశం చేయనున్న సీఎం జగన్. చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి ఆనుకుని సభ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను దారి మళ్ళించిన పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నేడు తిరుమలలో ధార్మిక సదస్సు, దాదాపు 57 మంది పాల్గోననున్న మఠాది పతులు, పీఠాధిపతులు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ నిర్వహిస్తున్న సదస్సు. గతంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి సదస్సు నిర్వహణ. మరలా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా రెండవసారి ఈ సదస్సు నిర్వహణ. తిరుమల లోని ఆస్థాన మండపం లో సదస్సు నిర్వహణ. సదస్సులో పాల్గొని మాట్లాడనున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఈరోజు అనగా న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి వారు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీ అమ్మవారి ఆలయంనకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామీజీ వారితో పాటుగా గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు విచ్చేశారు. అనంతరం స్వామిజి వారు శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకొని, పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు, అర్చకుల వారు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు గారు, అధికారులు స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదములు, పండ్లు సమర్పించగా, స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణము చేశారు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, కోడి పందాల నిర్వహించే వారిపై కూచిపూడి పోలీసులు దాడి. చిన్నముతేవి గ్రామం నుండి అయ్యంకి గ్రామం వైపు వెళ్ళు కాలువ గట్టుపై కొంతమంది వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు. 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 కోళ్ళు, 23,200/-రూపాయల నగదు, 6 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూచిపూడి ఎస్సై సందీప్. కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం చోడవరంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక క్వారీల తవ్వకాలు అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఇది మంత్రి జోగి రమేష్ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అంటూ క్వారీలో బైఠాయించిన బోడె. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే మంత్రి జోగి రమేష్ ఇసుక దందా చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చోడవరం క్వారీలో ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గం చోడవరం క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను బయటపెట్టేందుకు పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి క్వారీలో పరిశీలనకు వెళ్లారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన జెసి కేసి కంపెనీ కాకుండా అక్రమంగా మరో రెండు చోట్ల ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఒకటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది కాగా, మరొకటి వైసీపీ పార్టీకి చెందిన రెడ్డిదని స్థానికులు చెప్పారు. బోడె ప్రసాద్ రాకను గమనించిన జోగి రమేష్ అనుచరులు పరారయ్యారు వారితో పాటు పొక్లైన్ ఆపరేటర్లు ఇతర సిబ్బంది కూడా పరారయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించలేదని, పొంతన లేని సమాధానం చెబుతున్నారని బోడె ప్రసాద్ మీడియాకు తెలిపారు. మంత్రి జోగి రమేష్ పెనమలూరు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి వారం గడవకముందే ఇసుక దందాకు తెర లేపారని ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని బోడె ప్రసాద్ కోరారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవలసిన అధికారులే అండగా నిలబడటం దారుణమని ఇక్కడ అక్రమ మైనింగ్ ను నివారించే వరకు వారిని విడిచిపెట్టేది లేదని బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.
విశాఖ, మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య. కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన. రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు. గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి. అక్కడక్కడే కుప్పకూలిన తహసీల్దార్ రమణయ్య. ప్రాణప్రాయం స్థితిలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తహశీల్దార్ మృతి. ఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి రవిశంకర్ ఆయన్నర్. నిందితులు కోసం పోలీసులు గాలింపు. ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్…
పిప్పి పన్నుతో బాధపడేవారు ఒక చిన్న టెక్నిక్ ద్వారా పళ్ళను శుభ్రం చేసుకోవడం మాత్రమే కాకుండా పిప్పిపంటి బాధను చక్కగా ఇంట్లోనే తగ్గించుకునే ఔషధాల మొక్క గురించి చెప్పబోతున్నాను. ఇది మీరు ఏమి చేయాల్సిన పనేలేదు ఈ మొక్క ఆకులు మీకు దొరికితే చాలు మీ పంటి సంబంధిత సమస్యలు పరారు.. అక్టోబర్లో సీతాఫలం పండు విరివిగా లభిస్తుంది. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పండు చక్కటి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కేవలం పండు మాత్రమే కాదు.. సీతాఫలం ఆకులు కూడా అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. మన అవయవాల్లో అతిపెద్ద అవయవం చర్మం చాలామంది చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి వ్యాధి తీవ్రత ఎక్కువుంటే మరి కొంత మందికి పింపుల్స్ రూపంలో లేదా రాసేస్ రూపంలో చిన్న చిన్న పొక్కుల రూపంలో ఉంటూ ఉంటాయి. వాటిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. దీనికి ఎం చేయాలంటే కొన్ని సీతాఫల ఆకులను తెచ్చుకుని పసుపు ఉప్పు వేసి మెత్తగా నూరి ఆ పేస్ట్ ను మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేస్తే ఎలాంటి భయంకరమైన పుండ్లు అయినా సరే తగ్గిపోతాయి. నోటి దుర్వాసనతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ముందుగా నోటి దుర్వాసన పోవడానికి ఈ సీతాఫల ఆకులను ఒకటి రెండు తెచ్చుకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసి బాగా నమలండి. అలా నమలిన తర్వాత ఆ పిప్పి తో ఒకసారి పళ్ళను బాగా రుద్దుకోండి. తర్వాత నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించి ఊసి మరొకసారి మంచినీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజూ చేయడం వల్ల నోట్లో ఉండే క్రీములు చచ్చిపోతాయి. అలాగే పంటి గార కూడా తగ్గిపోతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మీ పళ్ళు చాలా తెల్లగా మారుతాయి. ఇక దుర్వాసన అనే సమస్య ఉండదు. ముఖ్యంగా పిప్పి పన్ను కూడా చాలా తొందరగా నయమవుతాయి. ఆ నొప్పి కూడా తగ్గుతుంది. పిప్పి పన్ను కోసం ఏం చేయాలంటే మీరు సీతాఫలం ఆకులను తెచ్చుకుని పేస్ట్ లాగా మెత్తగా నూరి ఎక్కడైతే పిప్పి పన్ను ఉందో ఆ పిప్పి పన్ను మీద ఈ పేస్టు ఉంచితే లోపల క్రిములు చచ్చిపోతాయి. పిప్పి పన్ను పెయిన్ కూడా ఆశ్చర్యంగా తగ్గిపోతుంది. అంటే ఎంత తొందరగా తగ్గిపోతుంది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటికి కూడా చాలా పల్లెటూర్లలో ఆకులను వివిధ వ్యాధులను తగ్గించడానికి వాడుతున్నారు. ముఖ్యంగా పంటి సంబంధిత సమస్యల కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ కు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. సభలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేలను పరోక్షంగా విమర్శించి, హెచ్చరికలు జారీ చేశారు. నందికొట్కూరులో పక్కా నియోజకవర్గం నాయకులు రాజకీయం చేశారని అదే రాజకీయం మీ నియోజకవర్గంలో నేను చేస్తే మీకు డిపాజిట్లు రావని సిద్ధార్థ రెడ్డి హెచ్చరించారు. గత నాలుగున్నర ఏళ్లలో అధికార పార్టీలో ఉన్న దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, అటువంటి పరిస్థితులలో కూడా కార్యకర్తలను వీడలేదని అన్నారు. నియోజకవర్గంలో వైసిపి గెలుపుకు ఓట్లు అడిగింది మేము, కేసులు మోపుకుంది మేము, ఇబ్బందులు పడింది మేము అని మా నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం వారి పెత్తనం ఏందని మా ఎమ్మెల్యే వాళ్ల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడడం ఏందనీ, ఎవడో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం ఏందని ప్రశ్నించారు. టిడిపి నాయకులను పక్కన పెట్టుకొని రాజకీయం చేయడం మగతనమని సొంత పార్టీ నేతలను ఘాఢంగా విమర్శించాడు. రాబోయే ఎన్నికలలో అభివృద్ధికి ఓటేయాలంటూ గౌరు వెంకటరెడ్డి, మాండ్ర, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తోపాటు తాజా ఎమ్మెల్యే ప్రజలను అడుగుతారు, ప్రజలు వీరిని నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ టిడిపి పార్టీలోకి వెళ్ళనున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. వైసీపీ మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని కానీ టిడిపి మేనిఫెస్టోను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అనంతరం వైసిపి అభ్యర్థి డాక్టర్ సుధీర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలు సుమారు 5000 నుంచి 8000 వరకు పాల్గొన్నారని వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని తెలిపారు.





Total views : 90572