జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించి ఎన్నికల బరిలో దిగుతున్నాం. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించింది. అందువల్లనే ప్రజలు మా వెంటే ఉన్నారు. మరోసారి జమ్మలమడుగు నియోజకవర్గం గెలుపు ఖాతాలో చేరుతుంది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడ ఫ్యాక్షన్ గొడవలు లేవు. ఫ్యాక్షన్ మూలాలు పూర్తిగా ఆంతరించిపోయాయి. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తికే పట్టం కడతారు. గడపగడపకు చేస్తున్న కార్యక్రమంలో మంచి స్పందన వస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని జమ్మలమడుగు నియోజక వర్గ ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి అన్నారు.
Sudheer reddy
కౌరవులైన MLA సుదీర్ రెడ్డి, అతని అనుచరులను ఓడించేందుకు పాండవులు ఐనా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా ఐక్యంగా కదులుతున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదు యస్కి గౌడ్ అన్నారు. మా ఐక్యత చూసి సుదీర్ రెడ్డి కి లాగులు తడుస్తున్నాయని అన్నారు. చైతన్యపురి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్ రెడ్డి రాంరెడ్డితో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..సుదీర్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, గుండాలను వెంబడి పెట్టుకొని కాంగ్రెస్ నాయకులను, కాలనీ అధ్యక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సుదీర్ రెడ్డి కబ్జాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాంరెడ్డి ఎంతో పోరాటం చేశారని అన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ఎల్బినగర్ ప్రజలను కోరారు.
Read Also..