కృష్ణా జిల్లా అవనిగడ్డనియోజకవర్గం. అవనిగడ్డ కేంద్రం గా నిరుద్యోగులు, తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన. డీఎస్సీ పోస్టులు విడుదల చేయాలని రాస్తారోకో(ఉపాధ్యాయులు ఉద్యోగాలు) భారీ గా నిరుద్యోగులు రోడ్డుపై వచ్చి,డిఎస్పీ పోస్ట్ భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయాలి. నిరుద్యోగులకు పూర్తిగా మద్దతు పలికిన, ప్రతిపక్ష పార్టీ,టిడిపి జనసేన. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ధర్నా లు ,రాస్తారోకో అనుమతులు లేవుంటూ ఆంక్షలు విధించిన పోలీసులు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆందోళనలు చేపట్టిన నిరుద్యోగులు. ధర్నా వద్దకు భారీ గా పోలీసు యంత్రాంగం
Tdp
మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో నారాయణతో పాటు ఇతరులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ అభ్యర్థన మేరకు వచ్చే వారానికి న్యాయస్థానం పిటిషన్లను వాయిదా వేసింది. అసైన్డ్ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ అధికారులు… మాజీ మంత్రి నారాయణ, ఇతరులపై కేసు నమోదు చేశారు. మరోవైపు తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ భార్య దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అరెస్ట్ సమయంలో తీసిన ఫోటోలను పోలీసులు న్యాయస్థానానికి అందించారు. అంతకుముందే పిటిషనర్ తరఫు న్యాయవాది.. సీసీ ఫుటేజీని కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై నాలుగు వారాల తర్వాత విచారిస్తామని హైకోర్టు తెలిపింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తుని నియోజకవర్గం తేటగుంట వద్ద చారిత్రాత్మక 3వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. 3వేల కి.మీలు అధిగమించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తునిలో యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు. ఈ మజిలీకి గుర్తుగా… వైసీపీ సర్కారు మూసేసిన పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈనెల 20వ తేదీన విశాఖపట్నంలో జరగనుంది. భోగాపురం ఎయిర్ పోర్టు సమీపాన గల పోలేపల్లిలో విజయోత్సవ సభ నిర్వహణ కోసం పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక కమిటీలను నియమించింది. నిర్వహణ కమిటీ బాధ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి యువగళం విజయోత్సవసభను జయప్రదం చేయాల్సిందిగా పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. యువగళం ముగింపు సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున, సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకత్వం వివిధ కమిటీలను ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర చివరి రోజుకు చేరుకుంది. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా లో ప్రవేశించనుంది. 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తోండంగి మండలం తేటగుంట వద్ద ఫైలొన్ ఆవిష్కరించారు. 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా లోకేష్ తో పాటు నారా బ్రహ్మణి, దేవాన్ష్, టీడీపీ జిల్లా ముఖ్యనేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభ ముగ్గురు మహనేతల సమన్వయంతో విజన్ తో ఉండబోతోందని అంటున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి సూరిబాబు మరింత సమాచారం అందిస్తారు.
Read Also..
శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో ప్రజలను కలవడానికి వెళ్తున్న జనసేన నాయకులకు దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. శ్రీకాళహస్తి వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గడప గడప కి వచ్చి ఇళ్లు ఇచ్చామని బుక్ ఇచ్చాడు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఇళ్లు ఎక్కడో చూపించమని వెళ్తే లోపలకి కూడా రానివ్వలేదని, ప్రజలు తమ దృష్టి కి తీసుకొచ్చారని, ఇళ్ళ పట్టాలు ఒక మోసం, దగా అని శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడులో జనసేన ఇంఛార్జి కోట వినుత ఆరోపించారు. ఇదే విషయం పై గడప గడపకు వెళ్తే మహిళలు ఖంగుతినే నిజాలు చెప్పారని వారు అన్నారు. రాబోయే రోజులలో టిడిపి జనసేన పొత్తులో భాగంగా తమ నాయకులను గెలిపించుకుంటే అందరికీ న్యాయం చేస్తామని కోట వినుత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ ని పర్మిషన్ లేదని ఎస్సై అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. ఇంటింటికి తిరగటానికి పర్మిషన్ ఎందుకని కన్నా అడిగారు. 50 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను ఇంటింటికి తిరగడానికి పర్మిషన్ ఎందుకని కన్నా లక్ష్మీనారాయణ అడిగారు. మంత్రి అంబటి కూడా అనుమతి తీసుకున్నడా అని కన్నా లక్ష్మీనారాయణ పోలీసులను అడగగా వారు ఆయన పర్మిషన్ తీసుకుంటున్నాడు అని అన్నారు. మంత్రి అంబటిని అరెస్టు చేయమని పోలీసులను కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. మీరు పర్మిషన్ తీసుకొని ఇంటింటి తిరగడం చేయండని చెప్పిన పోలీసులు చెప్పారు.
కందుకూరు పట్టణం 7వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు. బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా, విక్కిరాలపేట రోడ్డు, ప్రతిభ డిగ్రీ కాలేజీ ప్రాంతాల్లో ముస్లింల ఇళ్లకు వెళ్లి పార్టీ మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు ఆప్యాయంగా నాగేశ్వరరావు ని ఇంటికి ఆహ్వానించి, ఈ ప్రభుత్వంలో ఎదురైన ఇబ్బందులు, స్థానిక సమస్యల గురించి చెప్పుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అని, మైనారిటీ కుటుంబాల అభివృద్ధే లక్ష్యంగా దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, మైనార్టీ కార్పొరేషన్ రుణాలు, ఇమామ్, మౌజంలకు జీతాలు… ఇంకా అనేక పథకాలు అమలు చేశారని నాగేశ్వరరావు వారికి గుర్తు చేశారు. ముస్లిం సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటు బ్యాంకుగా చూడడం, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు నిలిపివేయటం తప్ప ఏమి చేయలేదని నాగేశ్వరరావు విమర్శించారు. వైసిపి పాలనలో రాజధాని లేకుండా చేసిన విషయాన్ని, జగన్ ఉత్తుత్తి హామీలను గుర్తు చేస్తూ, ఈ నాలుగున్నరేళ్లలో పెరిగిన ధరలు,పెంచిన చార్జీలు, పన్నుల గురించి ముస్లిం మహిళలకు వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, కందుకూరు పట్టణంలో ముస్లింలకు ఏయే పథకాల ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో అంకెలతో సహా ఆయన వివరించారు.
రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేయబోయే.. తల్లికి వందనం, ఆడబిడ్డనిధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు భృతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రైతులకు ఆర్థిక సహాయం, బీసీలకు రక్షణ చట్టం పథకాల గురించి చెబుతూ, ప్రతి ఇంటికి అందించబోయే లబ్దిపై హామీ ఇస్తూ, షూరిటీ బాండ్లను నాగేశ్వరరావు అందజేశారు. 7వ వార్డులో నాలుగు నెలల క్రితం నిర్మించిన డ్రైనేజీ కాలువ అప్పుడే దెబ్బతిన్న విషయాన్ని స్థానికులు తెలపగా నాగేశ్వరరావు పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో నాణ్యత లేకుండా ఇంత దారుణంగా పనులు చేస్తుంటే, ఎమ్మెల్యే నిద్రపోతున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులు నాసిరకంగా పనులు చేయడం, మున్సిపల్ కమిషనర్ వారికి వత్తాసు పలుకుతూ బిల్లులు చేయడం చూస్తుంటే… అందరూ కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. తనను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించి, రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని నాగేశ్వరరావు అభ్యర్థించారు. రాష్ట్రానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తోటివారికి వివరించి, ఈసారి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలా చూడాలని నాగేశ్వరరావు కోరారు. అనంతరం పార్టీ నాయకుడు యూనస్ ఇంట్లో జరిగిన దువా కార్యక్రమంలో నాగేశ్వరరావు పాల్గొనగా, మత పెద్దలు ఆయనను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు గౌస్ బాషా, రూబీ, ఖాదర్ బాషా, ఖలీల్, యూనిస్, వహీద్, జమీర్, ఖలీల్, బాషావలి, అస్మత్ భాయ్, ఖుద్దుస్, ఫరీద్, కోటేశ్వరరావు, అల్లం వెంకటేశ్వర్లు, చల్లా వెంకటేశ్వర్లు, చంటి, జియావుద్దీన్, కరిముల్లా, ఫాజిల్, గౌస్ బాషా, మహమ్మద్ అలీ, డాక్టర్ ఖాదర్ బాషా, సలాం, ఫిరోజ్, ఖలీల్, సయ్యద్ బాబు, బాషా, సుభాని, షఫీ, వలి, ఖాదర్ వలీ, నాయబ్ రసూల్ నాయకులు చిలకపాటి మధుబాబు, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, వడ్డేళ్ల రవిచంద్ర, బెజవాడ ప్రసాదు, షేక్ మున్నా, చుండూరి శ్రీను, ముచ్చు వేణు, షేక్ షరీఫ్, ముప్పవరపు వేణు, మచ్చ మనోహర్, గుమ్మ శివ, కల్లూరి శైలజ, అశ్విని సుధారాణి, ఎస్తేరమ్మ, బత్తిన నాగేంద్ర, పొడపాటి రాధ, పార్వతి ఇతర నాయకులు పాల్గొన్నారు.
జగన్ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడి బ్రతుకు పోరాటానికి నానా తిప్పలు పడుతున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పి చంద్రబాబుకు పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఉడి చెరువు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఓడి చెరువు నుంచి మద్దకవారిపల్లి వరకు20 కిలోమీటర్ల బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రజా కురుక్షేత్రంలో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలను నట్టేట ముంచి పైశాచిక ఆనందం పొందడంలో జగన్ కు సాటి మరెవరూ లేరని పల్లె విరుచుకుపడ్డారు. జనరంజక పాలనకు చంద్రబాబు రాష్ట్రానికి శరణ్యం అని పల్లె ఆశాభవం వ్యక్తం చేశారు. రాష్ట్రం పురోగమన దిశగా ముందుకు పోవాలంటే భావితరాలు పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును రాష్ట్ర ప్రజలు గెలిపించాలని పల్లె పిలుపునిచ్చారు. అనంతరం మద్దుగవారిపల్లికి చెందిన 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం, మేము పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి మూల సిద్ధాంతం తోనే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లి, రాయచోటి డివిజన్ డిఎస్పి మహబూబ్ బాషా, అర్బన్ సి సుధాకర్ రెడ్డి, టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి మణికంఠ గిరి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాల ధారణ ధరించిన అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనార్టీ ఆకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లీ తోపాటు రాయచోటి నియోజకవర్గం టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. వీరికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అతిథులుగా హాజరైన వారికి స్వామి వారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురుస్వాములు బసిరెడ్డి సురేష్ జయశంకర స్వాములను శాలువాలతో సన్మానించి పూలమాలతో సత్కరించారు. అదేవిధంగా అతిథులుగా హాజరైన వారిని కూడా అయ్యప్ప స్వాములు ఘనంగా సన్మానించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కఠినమైన, దీక్ష నియమములతో అయ్యప్ప స్వామి మాలధారణ ధరించడం చాలా అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా సోదరుల వలె కలిసి మెలగాలన్నారు. ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటూ సాంప్రదాయ పండుగలను నిర్వహించుకోవాలన్నారు. దాతల సహకారంతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసి మాల ధారణ ధరించిన స్వాములకు వసతి సౌకర్యాలతో పాటు బిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఆలయ నిర్వాహకులకు తమ పరిరక్షణ సమితి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్, మీడియా కోఆర్డినేటర్ అన్వర్, అయ్యప్ప స్వాములు తదితరులు హాజరయ్యారు.
Read Also..
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ ఆదివారం మధ్యాహ్నం స్థానిక ప్రైవేటు కల్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం నిర్వహించగా, సుమారు 4000 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ,,, 1983 లో కీర్తిశేషులు నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి టిడిపికి ఎనలేని సేవలు అందించానని 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున నేను, వైసీపీ తరఫున అమర్నాథ్ రెడ్డి పోటీ చేయగా స్వల్ప మెజారిటీ కారణంగా ఓడిపోయానని తిరిగి 2019 ఎన్నికల్లో టిడిపి ఆదేశాల మేరకు అమర్నాథ్ రెడ్డికి సహకారాలు అందించానన్నారు, కానీ టిడిపి అధిష్టానం స్థానిక నాయకులు నా కష్టాన్ని విస్మరించారని, నేను ఆర్థికంగా చితికిపోయిన పదవులు రాకపోయినా ఏనాడు, నిరుత్సాహపడకుండా పార్టీ కోసం కష్టపడిన ఫలితం లేదని, ఏ పార్టీలో చేరతారని విలేకరులు ప్రశ్నించగా, అభిమానులు మరియు ప్రజలతో చర్చించి ఏ పార్టీలో చేరుతానోనని తెలుపుతామన్నారు, కాగా సుభాష్ చంద్రబోస్ టిడిపి పార్టీ వీడితే కచ్చితంగా వైసీపీ పార్టీకి లాభం చేకూరుతుందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.