జగన్ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడి బ్రతుకు పోరాటానికి నానా తిప్పలు పడుతున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పి చంద్రబాబుకు పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఉడి చెరువు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఓడి చెరువు నుంచి మద్దకవారిపల్లి వరకు20 కిలోమీటర్ల బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రజా కురుక్షేత్రంలో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలను నట్టేట ముంచి పైశాచిక ఆనందం పొందడంలో జగన్ కు సాటి మరెవరూ లేరని పల్లె విరుచుకుపడ్డారు. జనరంజక పాలనకు చంద్రబాబు రాష్ట్రానికి శరణ్యం అని పల్లె ఆశాభవం వ్యక్తం చేశారు. రాష్ట్రం పురోగమన దిశగా ముందుకు పోవాలంటే భావితరాలు పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును రాష్ట్ర ప్రజలు గెలిపించాలని పల్లె పిలుపునిచ్చారు. అనంతరం మద్దుగవారిపల్లికి చెందిన 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
టీడీపీ లోకి భారీ చేరిక..
448
previous post





Total views : 141166