340
అన్నమయ్య జిల్లా రాయచోటి లోని శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం నందు రు.1.58 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న పశ్చిమ రాజగోపురం, సాలహరం నిర్మాణం శిలా ఫలకంను ప్రారంభించిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి… అదే విధంగా భక్తుల వసతి సౌకర్యార్థం రు.9.45 కోట్లతో రెసిడెన్షియల్ నిర్మాణానికి శిలాఫలకంను ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలలో ఆలయం చుట్టూ స్వామి వారి రథం తిరిగేందుకు రు.38 లక్షలతో పూర్తయిన మాడ విధులను వారు ప్రారంభించి, అనంతరం అన్నదాన విరాళ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోలం రెడ్డి విజయమ్మ, ఈఓ రమణా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, అన్నమయ్య జిల్లా దేవాదాయ శాఖ అధికారి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





Total views : 80353