వైసీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోందని, ఓటమి భయంతో వారు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తాజాగా చంద్రగిరి మండలం భీమవరంలో మునిరత్నం నాయుడుపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు. మునిరత్నం నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మునిరత్నం నాయుడు కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని నారా లోకేశ్ భరోసానిచ్చారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన సాగిస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మునిరత్నం నాయుడుపై దాడి ఘటనను ఖండించారు. టీడీపీ నేత మునిరత్నం నాయుడుపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు దాడికి దిగారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం గాల్లో తిరుగుతూ శాంతిభద్రతలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఎన్ని దాడులు చేసినా టీడీపీ వెనుకడుగు వేయదన్న విషయం గుర్తించాలని స్పష్టం చేశారు. మునిరత్నం నాయుడుపై దాడి చేసిన వైసీపీ నేతలపై ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునిరత్నం కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు.
Tdp
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటపురం గ్రామంలో బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగి చంద్రబాబు ఆవిష్కరించిన సూపర్ సిక్స్ లో బాగంగా మహిళలకు రైతులకు వివరించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఏ గ్రామంలో చూసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడి కృషే అన్నారు. అందుకోసమే చంద్రబాబు నాయుడు కు గ్రామాల్లో ప్రజా ఆదరణ పెరుగుతోందన్నారు. మనం అందరం సమిష్టి కృషితో టీడీపీ విజయానికి కృషి చేస్తూ, సీఎం గా చంద్రబాబు నాయుడు ను గెలిపిద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రగిరి మండలం, భీమవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడు పై వైసీపీ నేతలు బండరాళ్లతో దాడి చేశారు. గ్రామంలో జరిగిన ఓ కుటుంబ గొడవల కారణంగా మధ్యవర్తిగా పోలీస్ స్టేషన్ కు మునిరత్నం నాయుడు వెళ్లారు. మద్దిస్తం తెగకపోవడంతో వెనుదిరిగిన మునిరత్నం నాయుడు దింపుడు కళ్లెం దగ్గర వైసీపీ మండలం పార్టీ అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, మట్టిరెడ్డి నవీన్ రెడ్డి వారి అనుచరలతో కలిసి దాడి చేశారు. మద్యం, గంజాయి మత్తులో బండరాళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారంటు బాధితుడు మునిరత్నం నాయుడు తెలియజేశారు. దాడి అనంతరం మునిరత్నం నాయుడు దగ్గర బంగారం కడియం, రూ.10 వేలు నగదు దోపిడి చేశారు.. స్థానికులు తీవ్రంగా గాయపడిన మునిరత్నం నాయుడును ఏరియా ఆసుపత్రికి తరలించారు.. సమాచారం తెలుసుకుని టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని హాస్పిటల్ కు చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రుయా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు రుయా నుంచి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ కు తరలించారు.
టిడిపి , జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం విజయవాడ నోవాటెల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి తరఫున నారా లోకేష్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు , జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రెండు పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణ పై మూడు గంటలు సుదీర్ఘంగా చర్చించారు. టిడిపి జనసేన పార్టీలవైపు సుమారు మూడు కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని వారందరిని పలకరిస్తూ రెండు పార్టీలు కలిసి భవిష్యత్ గ్యారెంటీ అనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి టిడిపి జనసేన మేనిఫెస్టో, కరపత్రాలను అందిస్తామంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు పేస్ టూ ఫేస్..
సీపీఐ నేత రామకృష్ణ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. తనకు నెల్లూరులో మూడు ఓట్లు ఉన్నాయంటూ గత రెండు రోజులుగా సిపిఐ రామకృష్ణతో పాటు పలువురు టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు.నెల్లూరు లో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఇంటి పేరు మీద ఉన్న ఓటును తప్ప మిగిలిన అన్నింటిని తొలగించాలని గతంలోనే ఎలక్షన్ కమిషన్ కు డిక్లరేషన్ ఇచ్చానని తెలిపారు. ఆ డిక్లరేషన్ ను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. సిపిఐ, టిడిపి నేతల వలె తాను ప్రజలలో పబ్లిసిటీ లేని వ్యక్తిని కానని అన్నారు. తాను రెండవ ఓటు వేస్తేనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అనిల్ కు మూడు ఓట్లు ఉన్నాయంటు ఫేస్బుక్ అఫీషియల్ పేజీలో పెట్టిన నారాయణ..ఆయన అవినీతి బాగోతాలను కూడా పెట్టుకుంటే బాగుంటుందని విమర్శించారు.
అనంతపురం జిల్లా… రాయదుర్గం నియోజకవర్గం… రాష్ట్ర ప్రభుత్వం వైసిపి పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వ యంత్రాంగంతో తో నిర్వహించడం పై మండి పడ్డ మంత్రి కాలవ శ్రీనివాసులు. డి హిరేహాల్ మండలంలోని ఓబులాపురం గ్రామంలో మా కొద్దు జగన్ మళ్లీ రావద్దు జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెదేపా నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మాజీ మంత్రి కాలవకు బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. సచివాలయాన్ని సందర్శించి కొత్త పింఛన్ల నిర్లక్ష్యంపై అధికారులతో సమీక్షించారు. సచివాలయం ఎదుట తెదేపా నేతలతో కలిసి మాజీ మంత్రి కాల్వ బయటాయించి మాకొద్దు జగన్ మళ్లీ రావద్దు జగన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దాదాపు ప్రజల సొమ్ము 10 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బుక్లెట్ లు ముద్రించి జగనే మళ్లీ రావాలి అనే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు, ఎంపీడీవోలు, కలెక్టర్లను మొదలుకొని, అందర్నీ దీనిలో భాగస్వామ్యం చేయడం పూర్తిగా అధికార దుర్వినియోగం తప్ప మరొకటి లేదని విమర్శించారు. ప్రజల సొమ్ముతో వైసిపి పార్టీ పిచ్చి ప్రచారాం పై టిడిపి పార్టీ, రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారని విమర్శించారు. టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత కార్యక్రమం, పార్టీ కార్యక్రమానికి గానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోలేదని బదులిచ్చారు. జగన్ ఎందుకు రావాలంటూ రాయలసీమ భవిష్యత్తు ఎడారి అవుతున్నందుకా, మద్యం నిషేధం దశలవారీగా అమలు చేస్తామన్న జగన్ రెడ్డి మద్యం రేట్లు పెంచాడనినా, మద్యం విక్రయాలు పెంచాడనినా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశాడు. తప్ప నియంత్రణ ఎక్కడ జరిగిందని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాడు.
Read Also..
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చేసిన పని అని లోకేష్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఈ నకిలీ లెటర్ పై టీడీపీ కూడా మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే సీఎం జగన్ నైజమని టీడీపీ విమర్శించింది. ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. జగన్కు ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ నకిలీ లేఖ చెబుతోందని విమర్శించింది.
వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరువురు మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శల చేసుకోవడంతో ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. పురందేశ్వరిని విమర్శించే అర్హత విజయసాయిరెడ్డికి లేదని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఒక నొటోరియస్ క్రిమినల్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా పురందేశ్వరి 9 ఏళ్లుగా పని చేయడంతో ఆమె ప్రజలకు తెలుసు విజయిసాయిరెడ్డి మాత్రం ఏ2గానే ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. అసలు విజయసాయిరెడ్డికి సంస్కారం లేదని ధ్వజమెత్తారు. పురందేశ్వరి బయటపెట్టిన వైసీసీ ప్రభుత్వ అవినీతిపై విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని సోమిరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఫై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము సంచలన కామెంట్స్
వైసీపీ ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్ళ నుండి ప్రతిపక్ష పార్టీల గొంతు దారుణంగా నొక్కుతుంది…నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన అసమర్థతని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నాడు…గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకె, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మద్యం కేసు పెట్టారు….నరసరావుపేటలో ప్రతి సందులో ఈరోజు తెలంగాణ మద్యం అమ్ముతున్నారు…ఇకనుంచైనా గోపిరెడ్డి ఇలాంటి పిచ్చి వేషాలు మానుకుంటే మంచిది…నియోజకవర్గoలో జరుగుతున్న మాదక ద్రవ్యాలను పోలీసులు అరికట్టడం లేదు….ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రోద్బలంతోనే శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మద్యం కేసు…మా కార్యకర్తలను వేధించిన అధికారులపై ప్రయివేటు కేసులు వేస్తాం.






Total views : 91042