రైల్వే శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ సూపర్ యాప్ను డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్కు ఇండియన్ రైల్వేస్ రూ.90 కోట్టు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం అన్ని రైల్వే యాప్స్లో IRCTC రైల్ కనెక్ట్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇండియన్ రైల్వేస్ వివిధ రకాల సేవలకు కొన్ని యాప్స్ ఇప్పటికే లాంచ్ చేసింది. భారత్లో ప్రముఖ సంస్థల సేవలు కొన్నేళ్ల క్రితమే ఆన్లైన్ మోడ్లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరింత సులభంగా సేవలను యాక్సెస్ చేసేందుకు అప్లికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. ప్రయాణికులకు అన్ని సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఒక ఇంటిగ్రేటెడ్ మొబైల్ అప్లికేషన్ను రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది. దీని ద్వారా రైల్వే ప్రయాణికులకు యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టికెట్ బుకింగ్స్, PNR స్టేటర్ చెకింగ్, ట్రైన్ ట్రాకింగ్ వంlటి అన్ని రకాల రైల్వే సేవలను ఇదే యాప్లో అందిస్తారు. దీనికి తాత్కాలికంగా ‘సూపర్ యాప్’ అని పేరు పెట్టారు. రైలు టికెట్ల బుకింగ్కు IRCTC రైల్ కనెక్ట్ యాప్, జనరల్ టికెట్లు తీసుకోవడానికి UTS, రైలు ఎక్కడుందో తెలుసుకునేందుకు ‘నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్’ ఫిర్యాదులకు రైల్ మదద్ వంటి యాప్స్ ఉన్నాయి. దీంతో యూజర్లు సింగిల్ యాప్తో అన్ని సేవలను పొందవచ్చు. ప్రతి అవసరానికి వేర్వేరు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేవలను అన్నింటికీ ఇంటిగ్రేట్ చేసి సూపర్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. యూజర్ ఫీడ్బ్యాక్ను పరిగణనలోకి తీసుకుని సూపర్ యాప్ను రూపొందిస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఇది ఇండియన్ రైల్వేస్ డిజిటల్ సేవల పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపారు. రైల్వేస్కు సంబంధించిన అన్ని సేవలను ఈ అప్లికేషన్తో యాక్సెస్ చేసుకోవచ్చని, అవసరమైన డౌన్లోడ్స్ను ఇది తగ్గిస్తుందని సదరు అధికారి వెల్లడించారు.
technology news
విశాఖ జిల్లా పెందుర్తిలో వెలుగులోకి పోలీస్ దాష్టికాలు. స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే మహిళపై లాఠీ తో కసాయితత్వం చాటుకున్న ASI మురారి. ASI మురారి పేరు చేబితేనే బయబ్రాంతులకు గురౌతున్న చిరువ్యాపారులు ఐ యాం పోలీస్ తాట తీస్తా అంటూ చిరువ్యాపారులపై బండబూతులు. ASI వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధిత మహిళ. గాయాల బాధను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ, మహిళతో పాటు పలువురిపై విచక్షణ రహితంగా లాఠీచార్జి చేసిన ASI మురారి. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన.
అమరావతి, ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి రానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ అధికారులు ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితాలోని లోపాలు, అధికారులు సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితా, ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను అధికారులు పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఎన్నికల సంఘం అధికారులు భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈసీ నుండి ఆదేశాలు.
అమరావతి, నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్రావును పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్రావును ఆయన నివాసంలో పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, వైసీపీ అరకులోయ నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రస్తుత అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని నియమించడంతో అరకులోయ లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు. ఎంపీ మాధవి బిసి కి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందని, ఎస్టి కాదని, ఎస్టీకి చెందిన స్థానికేతరుడు కు అరకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని వైసీపీ శ్రేణులు ర్యాలీ, మానవహారం.
శ్రీకాకుళం జిల్లా, నిజం గెలవాలి పేరుతో నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల లో పర్యటించనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో మనస్థాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి. రాజాం జి.ఎం.ఆర్ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవలపేట గ్రామానికి చేరుకొని మృతి చెందిన కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి. అనంతరం అక్కడ నుండి మన్యం జిల్లా
భామిని మండలం బిల్లమడ గ్రామానికి చేరుకొని బిల్లమడ గ్రామంలో మృతి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శ. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం తోటాడ గ్రామం చేరుకొని తోటాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామంలో మృతి చెందిన గొర్లె తిరుపతిరావు కుటంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామం చేరుకొని ఆగ్రామంలో మృతి చెందిన ఆకేటి పాపయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
పుదుచ్చేరి యానాం నుండి అనధికారికంగా ప్రత్యేకంగా తయారుచేసిన ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించి ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్న ముఠా ను ముమ్మిడివరం పోలీసులు పట్టుకున్నారు. యానాం కు ఆంద్రా ప్రాంతానికి లీటర్ డీజిల్ కు రూ.12 రూపాయలు వరకూ వ్యత్యాసం ఉండటంతో ఈ అక్రమరవాణా చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. యానాం నుండి ఆత్రేయపురం తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం తో ట్రయినీ డిఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లయి అధికారులను రప్పించి వారి సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్యాంకర్ లో సుమారు 3వేల లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం.
మల్లంపేట ,ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఇంతియాజ్ మహమ్మద్, రూబీనా బానో(30) భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు కుమార్తె ఆల్సిత, కుమారులు సూఫీయాన్, అనాష్ ఈ నెల 2న భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య పిల్లలు కనబడుట లేదని ఫిర్యాదు. తాను ఉదయం 10 గంటలకు పనిమీద మియాపూర్ కు వెళ్లి సాయంత్రం 5 గంటలకు భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చిన అతనికి భార్యా పిల్లలు ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించిన భర్త. ఈ రోజు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త ఇంతియాజ్ మహ్మద్. ఫిర్యాదు స్వీకరించిన దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
IT రూల్స్, 2021 ప్రకారం భారతదేశం నెలవారీ నివేదిక ప్రకారం వాట్సాప్ నవంబర్ 1 నుండి 30 మధ్య 71,96,000 ఖాతాలను తొలగింపు చేసింది. వాట్సాప్ 2023 నవంబర్ లో భారతదేశంలో 71 లక్షల ఖాతాలను తొలగింపు చేసింది. నవంబర్ లో వాట్సాప్కు 8,841 ఫిర్యాదులు అందగా, వీటిలో ఆరు నివేదికలపై కంపెనీ చర్యలు తీసుకుంది. ఎవరైనా ఈ ఖాతాలను తొలగింపుకి ముందు కంపెనీ 19,54,000 ఖాతాలను ముందస్తుగా తొలగింపు చేసింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో భారత పౌరులు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి GAC భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాట్సాప్ కూడా గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ (GAC) నుంచి ఎనిమిది నివేదికలను అందుకుంది. వాట్సాప్ గుర్తింపు మూడు వేర్వేరు స్థాయిలలో పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్ వద్ద, మెసేజింగ్ సమయంలో, ప్రతికూల అభిప్రాయానికి ప్రతిస్పందనగా పని చేస్తున్నామని అని తెలిపింది. వాట్సాప్ ఏడాది పొడవునా గోప్యత, వినియోగదారు భద్రతను మెరుగుపరచడానికి అనేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కంపెనీ ప్రస్తుతం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, మ్యూట్ తెలియని నంబర్, చాట్ లాక్ వంటి లక్షణాలను కలిగి ఉంది.
తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైన నూరి ఫాతిమా మాట్లాడుతూ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. నా పై నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గుంటూరు 1 టౌన్ లో మైనార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. జగనన్న నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుంటూరు 1 టౌన్ లో భారీ మెజారిటీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్ గా అందిస్తాను. ప్రజలకోసం నిరంతరం కష్ట పడతాను. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారో అదే విధంగా ప్రజలకు చేరువలో ఉంటాను.
వైస్సార్ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తాను. నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన వైసీపీ అధిష్టానం కు తూర్పు కార్యకర్తలుకు, నాయకులకు ధన్యవాదాలు.