రైతు నేస్తం ప్రొగ్రామ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ల అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తమని సీఎం రేవంత్ అన్నారు. దశల వారీగా 3 సంవత్సరాల్లో 2,601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన చేయనున్నట్లు తెలిపారు. 97 కోట్లతో రైతునేస్తం ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరపవచ్చన్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవచ్చన్నారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం అమలవుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
thummala nageswara rao
చేనేత జౌళీ రంగాలపై పునర్వైభవం కోసం అధికార యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు సకాలంలో నిధులు విడుదల చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి సారించి తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. చేనేత పరిశ్రమలకు భారీగా పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. డిజైనింగ్, శిక్షణ, ఉత్పత్తి, మార్కెటింగ్, వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోచంపల్లి గద్వాల చేనేత పరిశ్రమల కు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను గ్రీన్ పార్క్ గా తీర్చిదిద్దేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఎందుకు సంబంధించిన ప్రణాళికలపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ని డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాటల వరకే పరిమితం కాకుండా మొదటి రెండు రోజుల్లో నే ఆరు గ్యారెంటీ ల్లో రెండు గ్యారెంటీ లను అమలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను అమలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టభోతోందని శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Read Also..
ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముగ్గురు మంత్రులు జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు చేరుకున్నారు. వీరికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రులు ర్యాలీగా ఖమ్మం బయలు దేరారు. అనంతరం మంత్రులు పాలేరు నుండి భద్రాచలం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గం నుండి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. రవాణా మంత్రి పదవి చేపట్టి ఖమ్మం రాజకీయాలలో తన దైన ముద్రను వేసారు. ఖమ్మం కు నిధుల వరద పారించారు. తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుంది అంటూ మూడోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఇందంతా నాణానికి ఒక వైపు మాత్రమే మరోవైపు ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయ నిరంకుషత్వానికి బ్రాండ్ అంబాజిడర్ గా మారారు. తొండ ముదిరి ఊసరవెళ్ళి అయినట్టు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం సోషలిస్ట్ గా కనబడిన పువ్వాడ మంత్రి పదవి చేపట్టగానే జిల్లా లో తన మాటే శాసనంగా ఫ్యూడల్ రూపమెత్తారు. తనకు వ్యతిరేఖంగా ఎవ్వరు ప్రవర్తించినా అక్రమ కేసులు, నిర్భందాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. మంత్రి పువ్వాడ అప్పటి అధికార అండతో ప్రతిపక్షాల గొంతునొక్కినా ప్రస్తుత ఎన్నికల్లో అవే గొంతులు ఖమ్మం లో పువ్వాడపై నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి.
తుమ్మల రాకతో సీన్ రివర్స్ ….
ప్రతిపక్షాలను ఎన్ని నిర్భందాలకు గురిచేసినా మంత్రి అనుచరులు తమ అవినీతి తో గుట్టలను గుటకాయ స్వాహా చేసినా తాను ఖమ్మంకు చేసిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తుందని నిన్న మొన్నటి వరకు అజయ్ ధీమా గానే ఉన్నారు . రాజకీయంగా బీఆర్ఎస్లో గత ఎన్నికల్లో తాను చెక్ పెట్టి పడగొట్టిన తుమ్మల కాంగ్రెస్ పార్టీలొ చేరడం ఖమ్మంలో తన పైనే పోటీకి దిగడంతో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. తుమ్మల రాజాకీయ చతురత ముందు పువ్వాడ ప్రచారంలోనే తేలిపోతున్నారు. ఖమ్మంలో అంతా తానై ప్రవర్తంచిన మంత్రి పువ్వాడను సొంత పార్టీ నేతలే అదును చూసి హ్యండిచ్చి ఒక్కొక్కరిగా హస్తం గూటికి చేరుతున్నారు. దీంతో తన గెలుపు నల్లేరుపై నడకే అనుకున్న పువ్వాడ క్షేత్ర స్థాయిలో నెల రోజుల వ్యవధిలోనే సీన్ రివర్స్ కావడంతో ప్రచార పర్వంలో ఆపసోపాలు పడుతున్నారు. ప్రత్యర్థి తుమ్మల పై ఏ అవినీతి ఆరోపనలు లేకుండా తెల్ల కాగితంలా ఉండడంతో మంత్రి పువ్వాడ అజయ్కు ఏంచెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే స్థానికతను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసినా ఆ అస్త్రం తుమ్మల పై పనిచేయడం లేదు. దీంతో ప్రత్యర్థిని ఎలా విమర్శించాలో తెలియని విపత్కర పరిస్థితి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ది.
తుమ్మల రాజాకీయ పద్మవ్యూహంలో చిక్కుకున్న అజయ్ ….
తనను ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించిన అనతి కాలంలోనే తుమ్మల అజయ్ ను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకున్నారు. అక్రమ కేసులే ఆయుదంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అక్రమ కేసులు నిర్భందాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కావాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఖమ్మంలో గెలుపును ప్రభావితం చేసే కమ్మ సామాజిక వర్గం తుమ్మలకు జై కొడుతుంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఎంపీ వద్ది రాజు పట్ల గతంలో పువ్వాడ వైఖరిని ఊటంకిస్తూ కాపు సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో తుమ్మల సఫలీకృతం అయ్యారు. ఖమ్మంలో బలంగా ఉన్న టీడీపీ క్యాడర్ తుమ్మల వెంటే ఉండడంతో గత రెండు దఫాలుగా నామామాత్రం మెజారిటీతో బయటపడ్డ పువ్వాడ ఈ సారి ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే అని రాజవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పువ్వాడకు పెట్టని కోటగా ఉన్న రఘునాథపాలెం సైతం తుమ్మల రాకతో బీటలు వారాయి. పువ్వాడను ఒక్కొక్కరిగా కార్పోరేటర్లు వీడుతున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ , మద్దత్తుగా నిలిచిన టీడీపీ శ్రేణులు, పొంగులేటి అనుచరులు, పొత్తుల్లో చేయి కలిపిన సీపీఐ తుమ్మలకు మరింత బలాన్ని చేకూర్చాయి. రోజురోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడంతో పువ్వాడ డిఫెన్స్లో పడ్డారు. తాను ఓడిపోయినా బీఆర్ఎస్ అదికారంలో వస్తుందని ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి పదవి చేపట్టి తాను ఓటమికి కారణం అయిన వారి సంగతి చూస్తానని పార్టీ వీడిన నేతలపై తన అనుచరుల వద్ద మంత్రి పువ్వాడ ఆక్రోశాన్ని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జి అయిన తాత మధు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారో, మీకు ఛాలెంజ్ దమ్ముంటే రా, ప్రజల ముందుకొచ్చి భద్రాచలం నియోజకవర్గానికి మీరు మీ పార్టీ ఏమి అభివృద్ధి చేశారో, అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఏ వేదిక పైనా అయినా మీ సిద్ధం అంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పొదెం వీరయ్య కు సవాల్ విసిరారు. తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై గత ఎన్ని సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ తుమ్మల పొంగులేటి పై ఘాటు గా విమర్శలు చేశారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకొని సుప్రీంకోర్టులో కేసు వేసింది మీరు కాదా, భద్రాచలం సీతారామస్వామి, మేడారం సమ్మక్క సారక్క ల సాక్షిగా గద్దల మీద ప్రమాణం చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య కు బహిరంగా సవాల్ విసిరారు ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు.
Read Also..
ఖమ్మం వాకర్స్ అసోసియేన్ సీనియర్ సిటిజన్స్ కోరుకునే విధంగా ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భగా తుమ్మల మాట్లాడుతూ.. మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజం ఆరోగ్యంగా ఉండేలా పాటుపడాలని.. కలుషిత రాజకీయాలను దూరం చేసి మానసికంగా దృఢంగా ఉండేలా అడుగులు వేయాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పాలేరు నుంచి పాపికొండల వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కిందని.. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల కోరారు. బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అభివృద్ధి శూన్యమని.. జిల్లాలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.





Total views : 75313