టీటీడీ ధర్మకర్తల మండలి నేడు తిరుమలలో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈ నెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు. టీటీడీ పర్మినెంటు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 14 వేల రూపాయలు, కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 6850 రూపాయలు ఇవ్వనున్నారు. పప్పు దినుసులు, చక్కెర, నెయ్యి నిల్వ చేసేందుకు అలిపిరి వద్ద మరో గోదాం నిర్మించాలని నిర్ణయించారు. కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15.54 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.
TTD
తిరుమల శ్రీవారిని తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలువల మీడియాతో మాట్లాడుతూ…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సంభందాలు బలపడాలని,రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని,
కలిసికట్టుగా ప్రపంచంతో పోటిపడాలని స్వామివారిని ప్రార్థించాను అన్నారు. తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను అన్నారు.
తిరుచానూరు.
అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనం ఇచ్చారు.
అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు , కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయనికి 10ఎకరాల స్థలం కేటాయించడం పై హర్షం వ్యక్తం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైసరి కమిటీ వైస్ ఛైర్మన్ మెట్టు రాఘవేంద్ర అభినందనీయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వాయిసరి కమీటీ వైస్ చైర్మన్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి లకు మెట్టు. రాఘవేంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హైద్రాబాద్ గోషామహల్ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అందులో భాగంగా తెలంగాణ, కరీంనగర్ లో కేసీఆర్ ప్రకటించిన 10ఎకరాల భూమి లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణానికి 20కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.అన్నివర్గాల మతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయం అని రాఘవేంద్రా పేర్కొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈవో రమేష్, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.
సనాతన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు. టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డీవీఆర్కే ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. హైందవ దర్మాన్ని అందరూ ముందుకు తీసుకు వేళ్ళలని కరుణాకర్ రెడ్డి అన్నారు. దళిత గోవిందను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి దేవాలయాల నిర్మాణల రూపకల్పనతో పాటు నిత్య దీప, దూప నైవేద్యం అందిచామని తెలిపారు. ప్రధాన నగరాల్లో ఉన్న ఆలయాలకు లోకల్ అడ్వయిజరీ కమిటీలను వేసి ఆలయాలను అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేస్తున్నామన్నారు. గడిచిన నాలుగేళ్ళలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సుమారు 2500లకు పైగా ఆలయాలను నిర్మించడంతో పాటు కొన్నింటిని పునర్నిర్మించామన్నారు. వేద సంస్కృతిని కాపాడటంతో పాటు వేద విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులు బాగుపడేలే ఎప్పటికప్పుడు టీటీడీ అనుబంధ విశ్వ విద్యాలయాలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చేందుకు టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా నిత్యం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో వాటిని మరింతగా పెంచుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా డీవీఅర్కే ప్రసాద్కు నియామక పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.
టిటిడి ఈఓ ధర్మారెడ్డి సవాల్ స్వీకరించేందుకు ఇక్కడి వచ్చాను… తిరుమల కొండపై ప్రాచీన కట్టడాలు తొలగిస్తూ విద్వాంసం సృష్టిస్తున్నారు… ప్రాచీన కట్టడాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా తోలగించరాదు… భారతీయ చట్టం ప్రకారం అది శిక్షా నేరం… గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 222 ప్రకారం ప్రాచీన కట్టడాలు తొలగించేందుకు అనుమతులు అవసరం … మీరు ఇష్టానుసారంగా ప్రాచీన కట్టడాలు తొలగిస్తే ఊరుకునేది లేదు… నిన్ననే టిటిడి ఈఓ కి లీగల్ నోటీసులు జారీ చేశారు… వారం రోజుల్లో దీనికి సరైన సమాధానం చెప్పాలి.. లేకుంటే కోర్టును ఆశ్రయిస్తాం… 500 సంవత్సరాల క్రితం విజయనగరం రాజులు నిర్మించిన ప్రాచీన మండపం నేడు నూతన మండపంలా మిగిలిపోయింది.. మా రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పటికే ఈ అంశంపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు లేక రాయడం జరిగింది.. ప్రధాన మంత్రికి కూడా దీనిపై తెలియజేస్తాం…





Total views : 90641