గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనధికార కట్టడాలు కట్టిన నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. అక్రమంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టినట్లు అయ్యింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక వైసిపి ముఖ్య నేత బినామీల పేర్లతో అక్రమ కట్టడాలకు తెర లేపారు. కూటమి ప్రభుత్వం రావడంతో నగరపాలక సంస్థ అధికారులు కట్టడాలు కూల్చివేయడం మొదలుపెట్టారు. హైడ్రా తరహాలో నగరపాలక సంస్థ అధికారులు అనధికార కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని లక్ష్మీ సెలబ్రేషన్స్ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఖలీల్ రెండు సంవత్సరాల క్రితం దాదాపు కోటి రూపాయలతో అక్రమ కట్టడం నిర్మించి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఖలీల్ కు మేయర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు
పేరుకు మాత్రం నామమాత్రపు నోటీసులు జారీ చేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఆ అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. నగర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న కమిషనర్ పులి శ్రీనివాసులను నగరవాసులు అభినందిస్తున్నారు. ఇలాంటి అనధికారిక కట్టడాలు ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిపై కూడా అధికారులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 91120