కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురవుతోంది. ఇటీవల పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలలో పర్యటించిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. కొత్తపల్లి మండలంలో వైసీపీలోని రెండు వర్గాలు కేసులు పెట్టుకునే పతాక స్థాయికి అసమ్మతి చేరింది. గృహ లబ్ధిదారులకు పట్టాలిచ్చినా స్థలాలు ఎక్కడున్నాయో చూపించలేదని నాగులాపల్లి లో ఎమ్మెల్యేను నిలదీశారు. ఇక్కడ ఎమ్మెల్యే దొరబాబును పరుగులు పెట్టించే వరకు పరిస్థితి దారితీయటంతో అధికారులు సైతం నివ్వెరపోయారు. దీనికి తోడు ఆయన సొంత అల్లుడు జనసేనలో చేరారు. ఈసారి దొరబాబుకు టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది.
ysrcp
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు. చల్లపల్లి మండలంలోని నాలుగు లంక గ్రామాల రైతులకు లీజు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, బందరు ఆర్డీవో ఎం.వాణి హాజరయ్యారు. లంక భూములు సాగు చేసుకుని జీవిస్తున్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మేలు కలిగేలా లీజ్ ను రెన్యూవల్ చేశామని సభాముఖంగా ఎమ్మెల్యే తెలిపారు. అర్హత కలిగిన 838 మంది లంక భూముల రైతులకు 760 ఎకరాల లీజు పట్టాలు పంపిణీ చేశారు. చల్లపల్లి మండలంలోని పాగోలు, మాజేరుల్లో 158 మందికి అసైన్డ్ భూములు, 39 ఎకరాలను 22ఏ నుంచి తొలగించి ధృవీకరణ పత్రాలు సింహాద్రి రమేష్ బాబు పంపిణీ చేశారు.
తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజదొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు ఉంది అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుందని టీడీపీ చేసిన ఆరోపణలు ముమ్మాటికి అబద్దం అన్నారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో కనీస అవగాహన లేకుండా మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్లో 241 కోట్ల రూపాయలు దోచుకుందెవరు? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? అని బుగ్గన నిలదీశారు. ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? సామాన్య ప్రజలలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ప్రజలకు స్పష్టమవుతుంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లాలో గురజాల శాసనసభ్యులు కాసు.మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చామని, అందులో భాగంగానే దాచేపల్లి పట్టణంలో కూడా సుమారు రెండువేల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, వాటితో పాటు డిసెంబర్ 10వ తేదీన దాచేపల్లి పట్టణంలో మరో పదహారు వందల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని వారు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి కులాయివేసి త్రాగునీరు అందిస్తున్నామని, ఇప్పటికే హెల్త్ సెంటర్లు నిర్మించామని వారు తెలిపారు. వీటితోపాటు కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇవన్నీ పూర్తి చేసి దాచేపల్లిని ఒక ఉన్నత పట్టణంగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు.
ఏపీ సీఎం జగన్ గొప్ప మానవతావాది అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. కుల గణన వల్ల రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సంక్షేమం అందుతుందని చెప్పారు. జగన్ నిర్ణయాలను దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారని…చరిత్రలో జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. పేదరికంలో ఉన్నవారు కూడా జగన్ పాలనలో డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని చెప్పారు. విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థుల జీవితాలు మారిపోతున్నాయని అన్నారు. విదేశాల్లో ఎక్కడ చూసినా మనవాళ్లే కనిపిస్తున్నారని చెప్పారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని .. తమకు సరైన పదవులు ఇవ్వకుండా అగౌరవ పరిచారని విమర్శించారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని రోడ్ల పరిస్థితి గోతుల మయమంటూ మొత్తుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్న ప్రభుత్వం.. అస్థవ్యస్తంగా గోతుల బారిన పడిన రోడ్ల దుస్థితిపై అధికార పార్టీపై గతంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వారు సవాల్ చేశారు.పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఆమడ దూరంలో ఉందంటూ విమర్శలు.. నేడు రహదారిలో పడిన గుంతలను మరమ్మతులు చేయిస్తున్న డాక్టర్ చింతలపూడి అశోక్ బాబు, ప్రజల అవస్థలను పట్టించుకోని వైసిపి వ్యవస్థను చూసి ప్రజల ఆగ్రాహిస్తున్నారన్న అశోక్ బాబు.. గురజాల నియోజకవర్గంలో రోడ్లకు నోచుకోని ప్రతీ గ్రామంలో చింతలపూడి ట్రస్ట్ తరుపున మరమ్మతుల కార్యక్రమాన్ని చేపడుతుందని హెచ్చరించిన అశోక్ బాబు.. గుంతల కారణంగా ప్రయాణికులు,పాదచారులు ఇక్కట్లకు గురవుతున్నా పట్టింకోని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు.ప్రభుత్వం బాధ్యతతో చేయాల్సిన రోడ్ల అభివృద్ధి ట్రస్ట్ లు చేసే దుస్థితికి దిగజారడం వైసిపి పార్టీ వైఫల్యమన్న డాక్టర్. ఇకనైనా రోడ్ల మరమ్మతులపై అధికారులు స్పందించకుంటే మరో ముందడుగు వేసి తమ ట్రస్ట్ తరుపున అన్ని మండలాల్లో అభివృద్ధి పనులకు తామే పూనుకొని చేస్తామన్న డాక్టర్ అశోక్ బాబు.
Read Also..
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథరాజు ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిటిడి నిధుల దారిమళ్లించ డాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ఇసుక దోపిడీ, సర్పంచుల దుర్వినియోగం, మద్యం కుంభకోణాల పై గణాంకాలతో సహా నిరూపిస్తున్న తమ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ నకిలీ మద్యంతో దశలవారీగా ప్రజలను చంపేస్తున్నారన్నారని ఆరోపించారు. పెండింగ్ కేసులపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సీజేఐకు లేఖ రాయడంతో బెయిల్ పై ఉన్న రాజకీయ కేసులపై త్వరలోనే ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారణ జరగనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందనీ హెచ్చరించారు.
సీఎం జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం హర్షణీయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని, రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్ మాత్రమేనని అన్నారు. కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. పదవులు ఇంకా పెరుగుతాయన్నారు. బీసీల నాయకత్వం జగన్ హయాంలో బాగా పెరిగిందని చెప్పారు. కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారన్నారు. బస్సుయాత్రలకు జనం నుండి విశేష స్పందన లభిస్తోంది. బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న సహాయం మరువలేనిది అంటూ కృష్ణయ్య కొనియాడారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు. సిఎం జగన్మోహన్ రెడ్డిపై అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రవి నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేస్తానని 2.35 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది జగన్ అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక డీఎస్సీ నోటిఫికేషన్ లేదు యువత ఉద్యోగాలు లేక డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారుతున్నరు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో 189 మంది యువకులు, నిరుద్యోగ యువత అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాలని రవి నాయుడు ఆరోపించారు.
ప్రయాణికులకు మెరుగైన వసతులతో పాటు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆర్టీసి చైర్మన్ మల్లికార్జున రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో బస్టాండ్ లో సుమారు 2.5 కోట్లతో నూతనంగా నిర్మించిన బస్టాండ్ విస్తరణ నిర్మాణాలను ఆర్టీసి అధికారులు, వైకాపా నేతలతో కలిసి వారు ప్రారంభించారు. వీరికి ఆర్టీసి అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్ ప్రాంగణం బస్సుల రవాణాకు, ప్రయాణీకుల సౌకర్యాలకు ఇబ్బందిగా ఉందని గుర్తించి.. అదనపు బస్ స్టాండ్ నిర్మాణానికి రూ 2.50 కోట్లు నిధులును మంజూరు చేయించామన్నారు. బస్ స్టాండ్ ప్రాంతాన్ని విస్తరించడంతో పాటు ఆధునిక వసతులతో భవనం, ఫ్లాట్ ఫార్మ్స్ విస్తరణ, లైటింగ్ లతో కూడిన సూచిక బోర్డులు, వర్టీకల్ టైల్స్, టాయిలెట్స్, ప్రహరీ గోడ ప్రయాణీకులకు సౌకర్యాల సుందరీకరణ తదితర అభివృద్ధి పనులు తీర్చి దిద్దడం జరిగిందన్నారు. దీంతో ప్రయాణీకుల ప్రాంగణం నగరాలలోని బస్ స్టాండ్ లకు ధీటుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అదే విధంగా కడప- రాయచోటి, రాయచోటి- తిరుపతి కి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు వారు తెలియజేశారు.