పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని రోడ్ల పరిస్థితి గోతుల మయమంటూ మొత్తుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్న ప్రభుత్వం.. అస్థవ్యస్తంగా గోతుల బారిన పడిన రోడ్ల దుస్థితిపై అధికార పార్టీపై గతంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వారు సవాల్ చేశారు.పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఆమడ దూరంలో ఉందంటూ విమర్శలు.. నేడు రహదారిలో పడిన గుంతలను మరమ్మతులు చేయిస్తున్న డాక్టర్ చింతలపూడి అశోక్ బాబు, ప్రజల అవస్థలను పట్టించుకోని వైసిపి వ్యవస్థను చూసి ప్రజల ఆగ్రాహిస్తున్నారన్న అశోక్ బాబు.. గురజాల నియోజకవర్గంలో రోడ్లకు నోచుకోని ప్రతీ గ్రామంలో చింతలపూడి ట్రస్ట్ తరుపున మరమ్మతుల కార్యక్రమాన్ని చేపడుతుందని హెచ్చరించిన అశోక్ బాబు.. గుంతల కారణంగా ప్రయాణికులు,పాదచారులు ఇక్కట్లకు గురవుతున్నా పట్టింకోని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు.ప్రభుత్వం బాధ్యతతో చేయాల్సిన రోడ్ల అభివృద్ధి ట్రస్ట్ లు చేసే దుస్థితికి దిగజారడం వైసిపి పార్టీ వైఫల్యమన్న డాక్టర్. ఇకనైనా రోడ్ల మరమ్మతులపై అధికారులు స్పందించకుంటే మరో ముందడుగు వేసి తమ ట్రస్ట్ తరుపున అన్ని మండలాల్లో అభివృద్ధి పనులకు తామే పూనుకొని చేస్తామన్న డాక్టర్ అశోక్ బాబు.
Read Also..





Total views : 147469