ysrcp
ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటి వెళ్లనున్నారు. సీఎం జగన్ పలు వివాహ వేడుకల్లో పాల్గోనున్నారు. జగన్ ఆ తర్వాత పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయం, శిల్పారామాన్ని ప్రారంభించనున్నారు. రాత్రికి ఇడుపులపాయ లో వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్హౌస్లో బస చేసి రేపు ఉదయం 8.30కు ఇడుపులపాయలో ఆర్ కే వ్యాలీ పోలీస్ స్టేషన్ను ప్రారంభించి రేపు మద్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకోనున్నారు.
జగన్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నాము-మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది….పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, Mlc చంద్రశేఖర్ రెడ్ది, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు…మంత్రి కాకాణి కామెంట్స్.. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం.. చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను జగన్ గాడిలో పెట్టారు.. అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించాం.. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ వచ్చింది.. స్కూల్స్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు ద్వారా 11 వెల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామ్.. నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ బార్బర్స్ ను నిర్మించాం.. మేనిఫెస్టోను మాయం చేసి.. ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకీ వెన్నతో పెట్టిన విద్య.. ప్రజలకు చేసిన మంచిని వారికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.. Dbt ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం.. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది.. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం.. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం..2024 లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగ పని చెయ్యాలి.. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది….పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, Mlc చంద్రశేఖర్ రెడ్ది, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు… మంత్రి కాకాణి కామెంట్స్.. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం.. చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను జగన్ గాడిలో పెట్టారు.. అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించాం.. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ వచ్చింది.. స్కూల్స్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు ద్వారా 11 వెల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామ్.. నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ బార్బర్స్ ను నిర్మించాం.. మేనిఫెస్టోను మాయం చేసి.. ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకీ వెన్నతో పెట్టిన విద్య.. ప్రజలకు చేసిన మంచిని వారికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.. Dbt ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం.. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది.. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం.. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం.. 2024 లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగ పని చెయ్యాలి.. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం..
వైసీపీ ప్రభుత్వం ఫై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము సంచలన కామెంట్స్
వైసీపీ ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్ళ నుండి ప్రతిపక్ష పార్టీల గొంతు దారుణంగా నొక్కుతుంది…నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన అసమర్థతని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నాడు…గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకె, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మద్యం కేసు పెట్టారు….నరసరావుపేటలో ప్రతి సందులో ఈరోజు తెలంగాణ మద్యం అమ్ముతున్నారు…ఇకనుంచైనా గోపిరెడ్డి ఇలాంటి పిచ్చి వేషాలు మానుకుంటే మంచిది…నియోజకవర్గoలో జరుగుతున్న మాదక ద్రవ్యాలను పోలీసులు అరికట్టడం లేదు….ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రోద్బలంతోనే శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మద్యం కేసు…మా కార్యకర్తలను వేధించిన అధికారులపై ప్రయివేటు కేసులు వేస్తాం.
మాచర్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలి అనే కార్యక్రమం రేపటినుండి ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు మొదలుకొని జడ్పిటిసిల వరకు నియోజకవర్గంలోని అందరు నాయకులు హాజరవుతారని అన్నారు . కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా భయపడకుండా అటు సంక్షేమాన్ని అమలుచేసి ఇటు కరోనాను కూడా ధైర్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 140 హామీలు గాలికి వదిలేసారని , స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 371 కోట్లు అడ్డంగా దోచుకుని దొరికిపోయారని అన్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెబుతున్న తెలుగుదేశం నాయకులకు రాష్ట్రానికి కొత్తగా వచ్చిన నాలుగు ఓడరేవులు, 10 షిప్పింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు ,రెండు విమానశ్రయాలు కనబడటం లేదా అని అన్నారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాచర్లకు విచ్చేసి 1,20,000 ఎకరాల వ్యవసాయ సాగుభూమికి నీరు అందించేందుకు వరికపొడిసెల ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. వినుకొండ ప్రకాశం మాచర్ల నియోజకవర్గం ప్రజలు ఆరోజు పాల్గొని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపాలని కోరారు.
రైతులను ఆదుకోవడమే ధ్యేయముగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంలో పామాయిల్ రైతులకు 250 కోట్ల రూపాయల వ్యయంతో 3F ఆయిల్ ఫామ్ ఫాక్టరీ రైతులకు అందుబాటులో ఉండేలాగా మెట్ట ప్రాంతంలో నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకన గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు.తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యావరం గ్రామంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు కొఠారు అబ్బాయి చౌదరి పాల్గొన్నారు…మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుగా భూమి పూజ చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు…అనంతరం మంత్రి గోవర్ధన రెడ్డి మాట్లాడుతూ గతంలో 20.000 పలికే పామ్ ఆయిల్ ధర ప్రస్తుతం 13000 రూపాయలు మాత్రమే ధర పలకడంతో పామాయిల్ రైతులు తీవ్ర నష్టంలో కురిపోయిన విషయం తెలిసిందేనని దీనిపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డికేంద్రంతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తున్నరని అన్నారు మంత్రి గోవర్ధన్ రెడ్డి…మెట్ట ప్రాంత రైతులకు నూతన పామాయిల్ ఫ్యాక్టరీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధికి దొరుకుతుందని, పామెయిల్ రైతులకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు…భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో 90% ఫామిలీ పంట కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే అది కూడా అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉందని పామెయిల్ పంటను సాగు చేయడం జరుగుతుందని
మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు …
విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాల ఆందోళన..!
విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకున్నసందర్భంగా నెల్లూరు ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోదీతో చేతులు కలిపి.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అధాని కి దారా దత్తం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, కడప ఉక్కును స్థాపించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి చిన్న బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
చంద్రబాబు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు.. 2014 మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబు 2024లో అమలు చేస్తారని ఎవరు నమ్ముతారు… 2019లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్… రాష్ట్రం అభివృద్ధి విషయానికొస్తే చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయంలో 17వ స్థానం లో ఏపి… జగన్మోహన్ రెడ్డి హయాంలో 9వ స్థానం లో.. చంద్రబాబు హయాంలో 34128 ఉద్యోగాలు.. జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు, రేగ్యూలర్ చేసిన వాటితో ఐదు లక్షల ఉద్యోగాలు… పరిశ్రమల విషయానికొస్తే రిజర్వే బ్యాంక్ ఆఫ్ ఇండియా తేలిపిన ప్రకారం 22వ స్థానంలో వుంది… జగన్మోహన్ రెడ్డి హయాంలో 3వ స్థానం లో వుంది… 12వేల కోట్లతో 38059 పాఠశాలలు నాడు-నేడు అభివృద్ధి. 10వేల పాఠశాలలో డిజిటల్ బోర్డులు.. వందలాది ఆసుపత్రులు రూపురేఖలు మార్చడం జరిగింది. 40లక్షలకు పైగా తల్లులకు అమ్మఒడి. జిఎస్డిడిపి లో చంద్రబాబు హయాంలో 22 వ స్థానం, జగన్ హయాంలో 2 స్థానం. కరోనా ను ధైర్యంగా ఏదుర్కోని ప్రజలకు అండగా నిలబడిన రాష్ట్రాల్లో ఎపి మొదటి స్థానం లో నిలబడింది… స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2019 వరకు 5 ఒడరేవులు, 5 హర్బర్ లు, 11 మెడికల్ కాలేజీలు మాత్రమే వున్నాయి… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఒడరేవులు, 10 హర్బర్ లు, 3 ఎయిర్పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు కోత్తగా ఏర్పాటు చేయడం జరుగుతోంది.
వైకాపా నాయకులు అవినీతి అక్రమాకేసులు ఎదుర్కొంటూ దెయ్యాలు వేదాలు వర్లిచ్చినట్టు ఉంది వైకాపా నేతల తీరు బిజెపి అధ్యక్షులు పరందేశ్వరిపై వైకాపా నాయకుల విమర్శలు పై ఆమె స్పందించారు. జగన్ వైకాపా పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టింది పేరు అని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఇసుక అటవీ సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. కరెంట్ బిల్లు చెత్త మున్సిపల్ పన్నులు వేసి ప్రజలను నడ్డి విరుస్తున్నారు. వైకాపా నాయకులు ఇద్దరు A 1. A 2 జగన్మోహన్ రెడ్డి విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి 10 సంవత్సరాల నుంచి తాత్కాలిక బెయిల్ పై ఉండటం ఎక్కడా లేదు అని తెలిపారు. ఇలాంటి అవినీతిపరులు విజయ్ సాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మీరా మా అధ్యక్షురాలు న విమర్శిస్తారా.. రాష్ట్రంలో జరిగిన మీ అవినీతిని ఆధారాలతో బయట పెట్టినందుకు మా అధ్యక్షులను విమర్శిస్తారని తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి గారి ఆదేశాలతో రాష్ట్రంలో బిజెపి అధికారంలో వచ్చే అంతవరకు ప్రజా సమస్యలపై పోరాడుదాం తెలిపారు.
మార్కాపురం పట్టణంలోని కంభం సెంటర్ షాది ఖానా నిర్మాణాలను స్థానిక ముస్లిం యూత్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్ మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో దివంగనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన షాది ఖానా అప్పటినుండి ఇప్పటివరకు నిర్మాణం జరుగుతూనే ఉందని ముస్లిం ప్రజలకు మాయమాటలు చెప్పి నాయకులు కాలం వెల్ల పుచ్చుతున్నారని అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి షాది ఖానా పూర్తి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. 2005 వ సంవత్సరం నుండి ఇంతవరకు షాది ఖానా పూర్తి చేయకుండా ముస్లింలను మోసం చేస్తూ కాలం గడిపేరే తప్ప ఎలాంటి పురోగతి లేదని అన్నారు. చేయకుండానే చేసినామని చెప్పుకోవడం రాజకీయ లబ్ధి కోసమే తప్ప మరొకటి లేదని విమర్శించారు. ఇప్పటికైనా షాది ఖానా నిర్మాణం పూర్తి చెయ్యకపోతే ముస్లిం మైనార్టీ ప్రజలంతా కలిసి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు ఇస్మాయిల్ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి షాది ఖానా పూర్తి చేశామని చెప్పడం ప్రజలని మోసం చేయడమే తప్ప మరొకటి లేదన్నారు. 18 సంవత్సరాలుగా షాది ఖానా నిర్మాణం చేపడుతున్నామని మాయ మాటలు చెబుతూ ముస్లింలను మోసం చేస్తున్నారని విమర్శించారు. షాది ఖానా కు 17 లక్షల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కాంట్రాక్టుకు బిల్లు చెల్లించలేదని, దానివల్ల నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. ఏ విధంగా షాది ఖానా పూర్తయిందని, ఎవరిని మోసం చేయడానికి చూస్తున్నారని ప్రశ్నించారు. ఆరు నెలల లోపు షాది ఖానా పూర్తి చేస్తే ముస్లిం ప్రజల ఓట్ల అడగండి లేకపోతే అడగవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Also..