మాచర్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలి అనే కార్యక్రమం రేపటినుండి ప్రారంభం కానుందని, ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు మొదలుకొని జడ్పిటిసిల వరకు నియోజకవర్గంలోని అందరు నాయకులు హాజరవుతారని అన్నారు . కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా భయపడకుండా అటు సంక్షేమాన్ని అమలుచేసి ఇటు కరోనాను కూడా ధైర్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 140 హామీలు గాలికి వదిలేసారని , స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 371 కోట్లు అడ్డంగా దోచుకుని దొరికిపోయారని అన్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెబుతున్న తెలుగుదేశం నాయకులకు రాష్ట్రానికి కొత్తగా వచ్చిన నాలుగు ఓడరేవులు, 10 షిప్పింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు ,రెండు విమానశ్రయాలు కనబడటం లేదా అని అన్నారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాచర్లకు విచ్చేసి 1,20,000 ఎకరాల వ్యవసాయ సాగుభూమికి నీరు అందించేందుకు వరికపొడిసెల ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. వినుకొండ ప్రకాశం మాచర్ల నియోజకవర్గం ప్రజలు ఆరోజు పాల్గొని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగనన్న తోనే సాధ్యం..
377
previous post




Total views : 180814