Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra PradeshGuntur నరసరావుపేటలో టిడిపి శ్రేణుల నిరసన ర్యాలీ..

నరసరావుపేటలో టిడిపి శ్రేణుల నిరసన ర్యాలీ..

by Prakash
TDP rally

పల్నాడు జిల్లా నరసరావుపేటలో టిడిపి శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు…టీడిపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా ర్యాలీ….ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి చదలవాడ అరవిందబాబు ,డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…టీడీపీ సానుభూతి పరుడు గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై అక్రమ మద్యం కేసు బనాయించిన రొంపిచర్ల ఎస్సై రవీంద్ర ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు…కార్యక్రమం టీడీపీ పార్లమెంట్ కార్యాలయం నుండి కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయాల వరకూ టిడిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు…పల్నాడుజిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు… ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ….రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం కు చెందిన గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లీలా మీడియా పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ టీడీపీ కి సానుభూతిపరుడుగా వ్యవహరిస్తున్నాడన్న అక్కసుతో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీసులతో అక్రమ మద్యం కేసు బనాయించి రిమాండ్ కు పంపడం దారుణమైన చర్య అన్నారు… ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు వ్యవహరించారన్నారు…చిన్న తనం నుండి మద్యం అలవాటు లేని గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై మద్యం విక్రయిస్తున్నాడని కేసు బనాయించి రిమాండ్ కు పంపడాన్ని టీడిపి తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు…ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ రొంపిచర్ల ఎస్సై రవీంద్ర పై ప్రయివేటు కేసు వేస్తామని టిడిపి నాయకులు అన్నారు…రొంపిచర్ల ఎస్సై రవీంద్ర రొంపిచర్లలో ఇటీవల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించి ఒక గ్రామంపై అసందర్భమైన వ్యాఖ్యలు చేశారని టిడిపి నేతలు ఆరోపించారు…

Advertisements

You may also like

Our Visitor

012534
Total views : 75321

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.