Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసానికి నోటీసులు…

టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసానికి నోటీసులు…

by Prakash
pemmasani chandrasekhar

గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఎం. గంగరాజు నోటీసులు. ఈ నెల 25న తాడికొండ మండలం లాం గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో పెమ్మసాని మాట్లాడుతూ సద్దాం హుస్సేన్ బంకర్లో దాక్కొని ఉంటే తీసుకొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారని చెప్పారు. దీనిపై ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా వేర్వేరుగా గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఓ వర్గం ఓట్లను చీల్చేందుకు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా అవా స్తవాలను ప్రచారం చేస్తున్నారని తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. వివరణ ఇవ్వాలంటూ పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆర్వో నోటీసులు జారీ. దీనిపై చంద్రశేఖర్ శుక్రవారం సాయంత్రం తన వివరణను ఆర్వోకు పంపారు.

Advertisements

You may also like

Our Visitor

039330
Total views : 196402

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: