తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచార సభలలో పాల్గొని రాహుల్ ప్రసంగించనున్నారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు బోధన్కు చేరుకోని అక్కడ నిర్వహించే ప్రచార సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్కు వెళ్లి అక్కడ సభలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్లో వేములవాడకు బయలుదేరతారు. సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు.
Adilabad
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు శాసనసభ సర్వత్రిక ఎన్నికల ప్రచారంలో నిరసన జ్వలాలు ఎదురుకుంటున్నారు. 2014 లో జరిగిన ఎన్నికలు, తెలంగాణ సెట్టిమెంట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2018లో ఎన్నికలు రెడోదాపా సంక్షేమ పథకాల,, అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలంటే మళ్ళీ గులాబీ పార్టీని గెలుపుంచాలన్న వాదం తో ప్రజల్లోకి వెళ్లారు కానీ 2023 శాసనసభ సర్వత్రిక ఎన్నికల్లో మూడో దాఫా విజయం పొందాలన్న ఆతృతతో గులాబీ తహ తహ లాడుతుంది కానీ అందుకు భిన్నంగా నియోజకవర్గల్లో అభ్యర్థుల పాలన పై అసంతృప్తి వెల్లువేత్తుతుంది భూ కబ్జాలు, ప్రభుత్వ భూములను ధరదాత్తం చేయడం, మౌలిక వసతులను సమాకుర్చడంలో విఫలం కావడం తో ప్రజల్లో ఆదరణ కరువైంది సొంత గ్రామాన్ని( జెండా వెంకట పూర్ ) అభివృద్ధి చేయకపోవడంతో గ్రామంలో వ్యతిరేక పావనాలు విస్తున్నాయి సొంత పార్టీ నాయకులు, ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని విడారు , మరి కొందరు కౌన్సిలర్లు పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది రెండు పర్యాయలు గెలిచినా దుర్గం చిన్నయ్య హైట్రిక్ గెలుపు నల్లేరు మీద నడక అన్నట్లుగా మారింది.
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈసుగాం సమీపంలో పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు యాబై వేలు విలువ చేసే 1.4 కిలోల గంజాయి పట్టుపడినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు ద్విచెక్ర్ వాహనాలను తనిఖీ చెయ్యగా వారి వద్దనున్న బ్యాగుల్లో గంజాయి పట్టుపడినట్లు తెలిపారు. మహారాష్ట్ర నుంచి కోనుగోలు చేసి ఇక్కడ విక్రయించేందుకు తీసుకు వచ్చినట్టు యువకులు తెలిపారని అన్నారు. ఈ మేరకు రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి ముగ్గురి పై కేసు నమోదు చేసినట్టు ఈసుగాం పోలీసులు తెలిపారు. కాగా పట్టుపడిన యువకులు ముగ్గురు కూడా మైనర్ లే అని పోలీసులు పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని జరగబోవు ఎన్నికలలో రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఐ ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి శ్రీనివాస్ ఈ రోజు విలేకరుల సమావేశంలో తెలిపారు. టీ.శ్రీనివాస్ మాట్లాడుతు….పేదలకు మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి వంటివి వారి కార్యకర్తలకు మత్రమే ఇచ్చుకున్నారు తప్ప పేద ప్రజలకు ఇచ్చింది లేదని పల్లె ప్రగతి వనాలని క్రీడా ప్రగాణాలని డంప్యాడ్లని దళిత భూములను గుంజుకున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రజా ప్రతినిధులు అమ్ముకున్నారు తప్ప పేదవానికి ఒక గుంట జాగ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ కార్మికులు రైతాంగం ప్రజలు తలరాతలు మారుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందని అన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తెలంగాణ ఉద్యమ సమయంలో స్వచ్ఛందంగా పాల్గొని పోరాటం చేసిన కార్మికులను పర్మినెంట్ చేస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరిని కూడా పర్మినెంట్ చేయలేదని సూచించారు. సింగరేణి పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని కొత్త బొగ్గు బావులు తవ్వి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఒక్క భూగర్భ బావిని తవ్వలేదని ఓసీలనే ప్రోత్సహిస్తూ జన సందోహానికి ఆటంకం కలిగిస్తున్నారు తప్ప కొత్త బావులు తవ్వట్లేదని తెలిపారు ఈ సమావేశం లొ పట్టణ ఇఫ్ట్ iftu జాఫర్ నాయకులు పాల్గొన్నారు.
Read Also..
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మండలం, కన్నాల గ్రామ పంచాయతీ లో నాతరీ స్వామి ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిది గా బెల్లంప్లలి ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కండువా కప్పుకొని పార్టీ లో చేరారు… ఈ సందర్బంగా వినోద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు గడప గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లను ప్రజలకు తెలిచేస్తూ… రానున్న ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ గెలిపించుకునే బాధ్యత మన అందరి పైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పద్మారెడ్డి, సూరిబాబు, కారుకూరి రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also..
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి డివిజన్, కాసిపేట్ టు ఇంక్లిన్ బుగర్భ గని మైన్ పైన ఈ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ గేట్ మీటింగ్ లో టిబిజికెఎస్ యూనియన్ అధ్యక్షులు బి. వెంకట్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పాల్గొన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులందరూ కేసీఆర్ వెంట నడిచారు. తెలంగాణ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము.
తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో కార్మికులకు ఆదాయపు మినహాయించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపినా కేంద్రం పెడచెవిన పెట్టింది.
సింగరేణి క్వార్టర్ కలిగిన కార్మికుడి జీతం పైన పెర్క్ టాక్స్ ను ( గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ సౌకర్యాలపై వేసేది ) కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా సింగరేణిలో కూడా యాజమాన్యమే కార్మికులకు చెల్లించేలా చేస్తామని మొన్న మందమర్రిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సింగరేణి క్వార్టర్లను కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు ఇస్తాం. 32% లాభాలను, స్పెషల్ ఇంక్రిమెంట్లను, సుమారు 17వేల డిపెండెంట్ ఉద్యోగాలు కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చామని తెలిపారు. ఇన్నేళ్లుగా కనబడని వివేక్ ఎన్నికలు రాగానే ఓట్ల కోసం కార్మికులపై దొంగ ప్రేమ చూపిస్తున్నాడు.
కార్మికులు సంఘాల పేరు మీద ఆగం కావొద్దు, తొందరపడొద్దు. కోట్ల డబ్బులతో కార్మికులను మోసం చేయాలని వివేక్ కుటుంబం చూస్తుంది.
డివిజన్ పరిధిలోని KK6, శ్రావణపల్లి ఓసి లను వేలానికి పెట్టింది. ఈ రెండు మైన్స్ ని వేలానికి వేసి తన కంపెనీకి అప్పజెప్పాలని కుట్ర చేస్తున్నాడు.
కాంగ్రెస్ కు వేసే ఓటు సింగరేణి సంస్థను ముంచడానికే అన్నారు. కార్మికుల తరఫున గొంతునై నినదిస్తా, ఏజెంటుగా సేవ చేస్తా దయచేసి కార్మికులందరూ సంఘాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించాలి అని బాల్క సుమన్ కొరారు.
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా మేనేజర్ శ్రీహరి , బిల్ కలెక్టర్ మహేందర్ ను అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్ పి( Dsp) రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. లక్షేట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఇటీక్యాల గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటికి నెంబర్ కేటాయించడానికి మే నెలలో మున్సిపల్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకొన్నాడు. నెంబర్ కేటాయించడానికి లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని మేనేజర్ శ్రీహరి డిమాండ్ చేసాడు. బాధితుడు శ్రీనివాస్ చివరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని
బాధితుడు ఆదిలాబాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దింతో బాధితుడు శ్రీనివాస్ నుంచి పదిహేను వేల రూపాయలు లంచం తీసుకొంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మందమర్రి మండలం, మరియు పట్టణంలో శుక్రవారం రోజు 1నుండి 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్ కాలనీ ఏరియాలోని 20 వార్డులో అంగడి బజార్ ఏరియాలోని శివాలయంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ సందర్భంగా సీనియర్ నాయకులు నోముల ఉపేందర్ గౌడ్, కడారి వీరస్వామి, నాయకత్వంలో ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, మహిళకు ప్రతినెల 2500 రూపాయలు,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ,ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసా, గృహ జ్యోతి ,ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పింఛన్లు ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బుర్ర రాజు గౌడ్, సోతుకు ఉదయ్, వెల్ది సాయి కృష్ణ, శ్రీనివాస్, నోముల పోచ గౌడ్, ఆకుదారి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, ప్రచారంలో పాల్గొన్నారు
తాము మూడేళ్లు ఆలోచించి ధరణిని తీసుకువచ్చామని, అలాంటి ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తుందని, ఈ విషయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే చెప్పారని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం అదిలాబాద్లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతుబంధుతో డబ్బులు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతుబంధును విడతలవారీగా ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామన్నారు.
చెన్నూర్ లో బాల్క సుమన్ కు ఉస్మానియా విద్యార్థుల సెగ తగులుతోంది. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు సీఎం కేసీఆర్ వెన్నంట ఉప్పెనలా కదిలారు. అందులో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి బాల్క సుమన్ ఒకరు. విద్యార్థి రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. అలాంటి బాల్క సుమన్ కు విద్యార్థి లోకం నిరసన తెలియజేస్తోంది. ఓయూలో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. యువ ఎమ్మెల్యేను ఓడించేందుకు ఓయు జేఏసీ సిద్ధమైంది. ఈ ఎన్నికలలో బాల్క సుమన్ ను ఓడించాలని ఓయూ జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు. గుండా రాజకీయం చేస్తున్నాడని, నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాల్క సుమన్ లాంటి ఎమ్మెల్యేలే కారణం మంటూ ఓయూ జేఏసీ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే బాల్క సుమన్ కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ నుండి వచ్చాయని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. చెన్నూరు నియోజకవర్గంలో రౌడీ రాజకీయాన్ని అంతమొందించాలని విద్యార్థి లోకం పిలుపునిస్తోంది. విద్యార్థులు తలచుకుంటే ఎలాంటి నాయకుడుకైనా గెలుపోటములు నల్లేరు మీద నడకే అని అనటంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also..




Total views : 194234