అయోధ్య లో పూజిత అక్షింతల మహా శోభ యాత్ర శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి అక్షింతలు పంపే కార్యక్రమంలో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియా పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి మార్కెట్ సెంటర్ పురవిధుల్లో విశ్వహిందూ పరిషత్ నాయకులు, ఆత్మీయ హిందూ భాందవులు, భక్తులు పల్లకి సేవ శ్రీ వెంకటేశ్వర దేవాలయం వరకు పల్లకి సేవ భక్తులు మహిళలు నిర్వహించారు. మందమర్రి పట్టణ మున్షిపాలిటీ పురవీధుల గుండా పల్లకి సేవ నిర్వహించి, మహిళలు కోలాటాలు, నృత్యాలతో రామనామ స్మరణతో మారుమ్రోగింది. ప్రతీ గడప గడపకు రాముని చిత్ర పటం, అక్షింతలు చేరే విధంగా కార్యాచరణ రూపొందించామని విశ్వహింద్ పరిషత్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని హిందూ జాతిని సమాజానికి చాటి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ పల్లకి సేవలో పెద్ద ఎత్తున భక్తులు మహిళలు పాల్గొన్నారు.
Adilabad
బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉండగా..ప్రస్తుతం కాంగ్రెస్ కు 11 మంది కౌన్సిలర్లు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుత చైర్ పర్సన్ శ్వేత తో కలిపి ఈ సంఖ్య 12 కు చేరింది. భారాసకు 21 మంది కౌన్సిలర్లు ఉండగా, భాజపాకు ఒక కౌన్సిలర్ ఉన్నారు. ఈ క్రమంలో భారాస కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 12న అవిశ్వాసానికి సంబంధించిన సమావేశం నిర్వహించడానికి కౌన్సిలర్లకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, భారాస తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. భారాసకు చెందిన కౌన్సిలర్లు బస్సులో ప్రత్యేక శిబిరానికి తరలివెళ్లారు. ఈ బస్సులో సుమారు 20 మంది భారాస కౌన్సిలర్లు శిబిరానికి వెళ్లారు.
CITU యూనియన్ నాయకులు చేసిన ట్రాన్సఫర్ ఆర్డర్ ఫై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, ఏఐటీయూసీ యూనియన్ పైన చేసిన ఆరోపణలను మందమర్రి ఏఐటీయూసీ యూనియన్ బ్రాంచి కార్యదర్శి సలంద్ర సత్యనారాయణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేకే5 గనిలో ఓవర్ మేన్ ట్రాన్స్ఫర్ విషయంలో AITUC యూనియన్ కు ఎలాంటి సంబంధం లేదు. ఈ ట్రాన్స్ఫర్లు గత సంవత్సరం తేదీ 30.9.2023 11 మంది మైనింగ్ స్టాప్ సిబ్బందిని కాసిపేట మైన్ కు బదిలీ చేయడం జరిగినది. కొంతమంది ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని జాయిన్ అయినారు కానీ ఈ ఓవర్ మెన్ ను CITU యూనియన్ వాళ్లు మేము ఆపుతామని అబద్ధపు వాగ్దానాలు చేసి ఆ ఓవర్ మెన్ కు అన్యాయం చేశారు. CITU, ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఈ ఓవర్ మెన్ ను రిలీవ్ చేయలేదు. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత పాత ఆర్డర్ ప్రకారం అందరినీ చేసినట్టుగా ఇతన్ని కూడా రిలీవ్ చేసినారు. సిఐటియు అసమర్థత నాయకులు తప్పుడు వాగ్దానం ఇచ్చి మోసం చేసి అతని మనన్నాలను పొందనికి గుర్తింపు సంఘం చేసిందని షో ఫుట్ ఆఫ్ ధర్నాలతో కార్మికులను మభ్యపెడుతున్నారు. ఇదే చిత్తశుద్ధి కార్మిక సమస్యలపై చేస్తే కార్మికులు హర్షిస్తారు. కానీ ఇలాంటి సంఘాలు ఓడిపోయామని అక్కసుతో ఏఐటీయూసీ గుర్తింపు సంఘాన్నిబదనాం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఎన్నికల ముందు యాజమాన్యంతో కుమ్మక్కై ఎన్నికలు ఆపాలని చూసినవాళ్లు ఏఐటియుసిని విమర్శించడం తాగదన్నారు ఆరోపణలు మానుకోండి అని హెచ్చరించారు.
మందమర్రి మున్సిపాలిటీ మైదానం లోని 19 వ వార్డు లో జరుగుతున్న ప్రజా పాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారంటీ ల ధరఖాస్తు స్వీకారం లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆలస్యం చేయకుండా ఆరు గ్యారంటీ లను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాము. అయిదు లక్షల రూపాయల తో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, అమలు చేస్తాము అన్నారు. కొత్త రేషన్ కార్డులను ఖచ్చితంగా ఇస్తాము, అభయహస్తం ధరఖాస్తు అందరూ చేసుకునేలా చూడాలి, చెయ్యని వారి ఇంటికి అధికారులు వెళ్లాలి, ఫోన్ చేసి మాట్లాడండి. అభయ హస్తం ధరఖాస్తులను స్వీకరించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో జిల్లా చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, తహసీల్దార్ చంద్రశేఖర్, అధికారులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి ఇల్లందు క్లబ్ లో నూతన సంవత్సరం 2024 వేడుకలు మంచిర్యాల జిల్లా మందమర్రి, సింగరేణి అధికారులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏరియా జియం A. మనోహర్ సవిత పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ముందుగా సింగరేణి కార్మికులకు, అధికారులకు, ఉన్నతాధికారులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి నృత్యాలు చేస్తూ ఆనంద ఉత్సాహాల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 31 గతంలోని బాధలను మరచిపోయి, కొత్త సంవత్సరంలో వాటి గురించి ఆలోచించకుండా మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో మన జీవితాలను, కాపాడుకోవాలి, మనం మంచి అలవాట్లను మరియు మన నూతన విజయాన్ని పునరుద్ధరించుకుందాం. గత సంవత్సరం నిరాశాజనకంగా చెడుగా ఉంటే, కొత్త సంవత్సరం ఆశాజనకంగా క్రొత్తగా ఉండాలని కోనియాడారు.
బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఈ రోజు వరంగల్ లోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది. ఎప్పుడు వరంగల్ కి వచ్చిన వినయ్ అన్న ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్తాను. మన జిల్లాలో ఇలాంటి జాతర ఉండటం మన అదృష్టం. ఇలాంటి జాతర కి నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ను కోరడం జరిగింది. కానీ ఇంకా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ప్రజలందరూ కలిసి సమ్మక సారలమ్మ జాతరకు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇచ్చేదాకా పోరాటం చేయాలి. ఈరోజు వరంగల్ నుండి బిజెపి పార్టీ నాయకులకి, నరేంద్ర మోడీకి తెలియజేయడం జరుగుతుంది. సమ్మక్క, సారలమ్మ జాతరకి స్టేట్స్ ఇవ్వాలి అని, ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ కావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్లు మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మేడారం జాతర కు 100 కోట్లు ఇచ్చాము. బస్ ఫ్రీ అన్నప్పటి నుండి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారక్క దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పురుషులకి ప్రత్యేక బస్సులు, స్త్రీలకు ఇబ్బంది కలగకుండా బస్సుల సంఖ్యను పెంచే ఆలోచన చేయాలి. ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలి. పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి. ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండవు, రాజకీయంలో గెలుపు ఓట్లములు సహజం. ప్రజలకు ఆసౌకర్యo కలగాకుండా 2000 ల పెన్షన్ వచ్చే వారికి 4000 ల పెన్షన్ పెంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వమిచ్చిన ఈ పథకాలపై ప్రజలలో చాలా అనుమానాలు ఉన్నాయి. నిరుద్యోగ భృతి అనేది ఇస్తాం అన్నారు, కానీ వారు ఇచ్చిన ఆ గ్యారంటీ పధకాలలో ఎక్కడ ఆ కాలం కనిపించడం లేదు, యువకులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పై ప్రజలు కొన్ని విషయలలో అయోమయం లో ఉన్నారు. ప్రజలను కష్ట పెట్టడం తప్ప ఈ పధకాలు అన్ని కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, మీ సెవా లో ఒక బటన్ ఒత్తుతే పూర్తి వివరాలు వస్తాయి కానీ ప్రభుత్వం ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందో ప్రజల ఆలోచించాలి.
మందమర్రిలో విషాదం నెలకొంది. తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్- ధనలక్ష్మి దంపతులు ఇక్కడ పాపడాలు, చెకోడీలు తయారు చేసి విక్రయించడం చేస్తున్నారు. వ్యాపార పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లిన తర్వాత అర్థరాత్రి సమయంలో ధనలక్ష్మి, కూతురు జీవని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు సిద్దు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ గమనించలేదు. ఉదయం లేచి చూసేసరికి అక్క,తల్లి శవాలుగా కనిపించడంతో షాక్ కి గురయ్యాడు. కొంతసేపటికి తేరుకొని బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిచూసేసరికి విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే మురుగన్ రాత్రి నుండి ఇంటికి రాకపోవడం, అతని సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మురుగన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కార్మికులకు ముక్క చుక్క ఆశ చూపి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న INTUC సంఘం, గడిచిన 10 సంవత్సరాలలో కార్మికులను పీల్చి పిప్పి చేసిన సంఘం అడుగుజాడలలో INTUC సంఘం నడుస్తుంది. రాజకీయ జోక్యాన్ని పెంచి పోషించే దిశగా అడుగులు వేస్తుంది. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా, అసలు కార్మికుల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయని సంఘం, కార్మికులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే ఒక్కసారి కూడా ఇటు వైపు చూడని సంఘం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని గెలుపు కోసం అడ్డమైన దారులు తొక్కుచున్నది. కార్మిక సోదరులారా ఇప్పటికైనా ఆలోచించండి కార్మికుల బాగు కోరే సంఘం ఏదో, స్వలాభం చూసుకునే సంఘం ఏదో. మనం ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన కోసం ఎంతో మంది అమర నాయకులు సాధించి పెట్టిన హక్కులు మన దగ్గర ఉన్నాయి. అవి మన దగ్గర ఉన్నంత సేపు మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు.
భయం అనే సంక్కెళ్లు తెంచుకొని ఒక్క అడుగు ముందుగా వేసిచూడు నీ బలం ఏంటో నీకే తెలుస్తుంది. నీ వెనుక ఎర్ర జెండ ఉంది, నీకు అండగా AITUC నాయకులు ఉన్నారని సీతారామయ్య అన్నారు. ఆలోచించు మన హక్కులను కాపాడుతూ సింగరేణి ని కాపాడే మన AITUC ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. AITUC గెలుపు సింగరేణి కార్మికుని గెలుపు నక్షత్రం చుక్క గుర్తుకే ఓటు వేసి గెలిపించండి అని కోరారు.
Read Also..
సింగరేణిలో ఏడో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. సింగరేణిలో అన్ని పార్టీలు తమ సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమించాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది కార్మికులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టియుసి కూడా విజయ కేతనం ఎగుర వేసేందుకు ఊవ్విళ్లూరుతోంది. బిఆర్ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొన సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికి కోసం ఉబలాటపడుతున్నాయి.
క్రిస్మస్ వేడుకలు మందమర్రి పట్టణంలో క్రైస్తవులు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం ఉదయం నాలుగు గంటల నుండి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. క్రీసు జన వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా చర్చిల్లో పశువుల పాకను ఏర్పాటు చేశారు. చిన్నారులు వేసిన క్రిస్మస్ తాత వేషధారణలు ఆకట్టుకున్నాయి. మందమర్రి పట్టణం ఒకటవ జోన్ లోని సి.యస్.ఐ చర్చ్ ఫాదర్ రెవ.జెర్మీయా ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. సర్వ మానవాళి యేసు చూపిన శాంతి మార్గంలో నడవాలన్నారు. అనంతరం క్రిస్మస్ పండగ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
Read Also..





Total views : 194471