నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారత్ గ్యాస్ కార్యాలయం ఎదుట మహిళలు బారులు తీరారు..ఈ కేవైసీ ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున కార్యాలయం ముందు బారులు తీరారు. ఈ కేవైసీకి గడువు ఉంది. కాని తెలంగాణలో ప్రభుత్వం మారడంతో గ్యాస్ సిలిండర్ 500 కే ఇస్తాము అని ప్రకటించడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు తమ ఆధార్ ను అనుసంధానం చేసుకుంటూన్నారు.
Mahabubnagar
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం ఆయన. తెలుగు రాజకీయాలలో సంచలనాలకు చిరునామా. వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషం. అధిష్టానం ఆశీస్సులతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం మరో విశేషం. పార్టీని అధిక స్థానాలలో గెలిపించడం అంతకన్నా గొప్ప విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి గట్టి సమాధానం చెప్పారు రేవంత్. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా సవాళ్లు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. 2021లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి… సుదీర్ఘ కాలంగాపాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ కు ఆ తర్వాత ఉపఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సమయంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. వారిని సమన్వయం చేసుకుంటూనే ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ తనదైన ముద్ర వేశారు. రేవంత్ రెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా. ఊరు కొండారెడ్డి పల్లె. తండ్రి నరసింహారెడ్డి. తల్లి రామచంద్రమ్మ. 1969 ఆగస్టు 8న జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి. టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. అనంతరం డిగ్గీ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1992లో ఉస్మానియా అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్… పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ లో చురుకుగా పనిచేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు. అది విజయవంతం కావడంతో… రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. టీడీపీలో ఉన్నా.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచే కొడంగల్ లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో 14,614 ఓట్ల మెజారిటీతో రేవంత్ గెలిచారు. 2017లో రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు చంద్రబాబు. ఓవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతకంతకూ బలహీనపడింది. కీలక నేతలంతా కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. ఉన్న వారు పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండిపోయారు. దీంతో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కత్తిమీద సాములా మారింది. అప్పటికే ఓటుకు నోటు కేసులో కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీవైపు దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్ 17న ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 30న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ముగ్గురు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఒకరిగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ లో ప్రస్థానం ప్రారంభించిన రేవంత్… 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగారు. ఆ దఫా ఆయన ఓటమి పాలయ్యారు. రేవంత్ కున్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చింది. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఆయన 10,919 ఓట్ల తేడాతో గెలుపొందిన రేవంత్… మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటూ రేవంత్ ఇచ్చిన పిలుపును తెలంగాణ ఓటర్లు నిజం చేశారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్కు కలిసొచ్చాయి. బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. డీలా పడిపోయింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గజ్వేల్లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. మంత్రుల్లో ఎనిమిది మంది విజయం సాధించారు. ఆరుగురు పరాజయాన్ని మూటకట్టుకున్నారు. BRS తనకు పట్టున్న పలు నియోజకవర్గాలను కూడా కోల్పోయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం రెండుచోట్ల పోటీ చేసినా.. కామారెడ్డిలో ఓడిపోయినా… కొడంగల్లో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రెండుసార్లు అధికారమిచ్చిన BRS ను మార్చాలనే అభిప్రాయంతోపాటు.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఓటర్లపై ప్రభావం చూపింది. BRSకు చెందిన సీనియర్ నాయకులు ఓటమి పాలయ్యారు. పరాజయమే ఎరుగని నేతలను.. తొలిసారిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ యువ అభ్యర్థులు మట్టి కరిపించారు. BRS కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాలను కాంగ్రెస్ బద్దలు కొట్టింది. గత నాలుగైదు ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని స్థానాలు కూడా ఇప్పుడు చేతికి చిక్కాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుల్లో అత్యధికులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరింది.
బంగాళా ఖాతం లో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబబాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, నేడు, రేపు రెండురోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి.ఎస్ శాంతి కుమారి సూచించారు.
Read Also..
Read Also..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం బాదేపల్లి ఎర్రగుట్ట కాలనీలో నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. ఎర్రగుట్ట కాలనీ గత ప్రభుత్వం 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. అయితే లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందజేయలేదు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దీంతో ఇళ్లు తమకే చెందుతాయంటూ నిరుపేదలు ఒక్కసారిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు వెళ్లి తాళాలు విరగగొట్టి కొత్త తాళాలను వేసుకొని ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. ఎన్నో ఏళ్లుగా తాము గుడిసెల్లో జీవిస్తున్నామని ఇల్లు లేని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also..
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో బీజేపీ నాయకుల సంబరాలు జరుపుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో పార్టీ గెలవడంతో ….కొల్లాపూర్ లో బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. నిన్న మూడు రాష్ట్రాల్లో వెల్లడైన ఫలితాల్లో బీజేపి గెలవడంతో సంబరాలు జరుపుకున్నామని బిజెపి సీనియర్ నాయకుడు సాయికృష్ణ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గల్లీలో తప్ప… ఎక్కడ కూడా లేదన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ దూసుకుపోతోందనడానికి నిన్నటి ఫలితాలే నిదర్శనమన్నారు. త్వరలోనే దేశమంతా కాషాయ మయంగా మారనుందని, కాంగ్రెస్ లేని దేశంగా త్వరలోనే చూడబోతున్నామని అన్నారు. కొల్లాపూర్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గతంలో చేసిన మాదిరిగా కాకుండా …. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించాలని సూచించారు. అలాకాకుండా ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఆందోళనలు నిర్వహిస్తామని సాయి కృష్ణ హెచ్చరించారు.
వనపర్తి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 296 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. దాదాపు అన్ని చోట్ల లోపల, బయట సి సి కెమెరా లు పెట్టడం జరిగిందని, వాటిని కంట్రోల్ రూం నుండి నియంత్రించడం జరుగుతుందన్నారు. 1587 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి రూట్ అధికారులు, సెక్టోరియల్ , మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 271151 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 135654 మంది మహిళా ఓటర్లు 135491 మంది ఇతరులు 6 మంది ఉన్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కంటే పోలింగ్ శాతం పెంచేందుకు 5 మహిళా పోలింగ్ కేంద్రాలు, ఒక పి. డబ్లు.డి, మండలానికి ఒకటి చొప్పున 7 మాడల్ పోలింగ్ కేంద్రాలు, ఒక యువ ఓటర్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని 541 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన పోలీస్, రిజర్వు బలగాలు ఏర్పాటు చేయడం, ఎన్నికలు శాంతియుతంగా స్వేచ్చగా జర్పించెందుకు అసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టడం జరిగిందన్నారు. వంద మీటర్ల పరిధి, 200 మీటర్ల పరిధి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి చేయకుండా తాను గద్దినెక్కాడని తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, 9 ఏళ్ల క్రితం రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానన్నావు చేసావా, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కల్పించారా అంటూ సిఎంని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేసారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాటలు చెప్పే మనిషే కానీ మాట మీద నిలబడే మనిషి కాదని దళితున్ని ముఖ్యమంత్రి ని చేస్తానని చెప్పి తానే తొమ్మిది ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిని అనుభావిస్తున్న మాటకరని రాష్టంలో ఉన్న నిరీద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తన కుటుంబ సభ్యులకు పదవులను కట్టబెట్టిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఈరోజు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ఉచిత కరెంట్ వస్తుందంటే అందులో తన పాత్ర ఉందని ఆనాడు రైతులకు అదనంగా కరెంట్ చార్జీలు వసూలు చేస్తుంటే రైతు సమస్యలపై పోరాడి కొట్లాడి రైతన్నలకు ఉచిత కరెంట్ కల్పించిన ఘనత నాది అన్నారు. వందలాది మంది యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పిట్టల్లా చనిపోతుంటే చూడలేక మంత్రి పదవిని సైతం రాజీనామా చేశాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో నాపాత్ర ఉందని ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. గత 19 యేండ్లుగా నియోజకవర్గంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నేడు మీరు చూస్తున్న ప్రాజెక్టులు రైతు బంధు రైతు భీమా నీటి కాలువలు పెంక్షన్లు సీసీ రోడ్లు కరెంట్ ప్రభుత్వ భవనాలు ఇలా చెప్పుకుంటు పోతే నేడు మీరు చూస్తున్న అభివృద్ధి నేను చేసిన అభిద్దే అన్నారు. ప్రజలు తెలంగాణ రాష్టంని ఇచ్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాదని వేరే పార్టీలకు ఓటు వేస్తే మళ్ళీ ఇక్కడి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నే గెలుస్తాడు అన్నారు. పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలకోసం శ్రామిస్తానని కాంగ్రెస్ పార్టీని నన్ను మళ్ళీ ఒకసారి ప్రజలు అదరించి 30 న జరిగే ఎన్నికల్లోఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
Read Also…
Read Also…
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుమారు మూడు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు జిల్లాలో సోదాలు నిర్వహించారు. ఒకరు విశ్రాంత ప్రిన్సిపాల్ కాగా, మరొకరు ప్రముఖ బంగారు వ్యాపారి తో పాటు పత్తి మిల్లు యజమాని ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారన్న సమాచారం సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అయింది. ఎన్నికల వేళ ఐటి అధికారుల సోదాలు నారాయణపేట జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపాయి. ఇండ్లలో సోదాలు జరిపిన ముగ్గురిలో ఇద్దరు అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న వారు కావడం, నారాయణపేట జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. చాలా రోజుల తర్వాత జిల్లా కేంద్రంలో ఐటీ అధికారులు సోదాలు జరపడం విశేషం. ఇదిలా ఉండగా ఐటీ అధికారులు సోదాలు జరపడంతో జిల్లా కేంద్రానికి చెందిన మరి కొంతమంది బడా వ్యాపారులు ఉలిక్కిపడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లోని కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ నివాసంలో అర్ధరాత్రి విజిలెన్స్ మరియు ఐటీ దాడులు సోదాలు నిర్వహించారు. పోలీసులు వచ్చిన సమయంలో సంపత్ కుమార్ నివాసంలో లేకపోవడంతో ఆయన సతీమణి మహాలక్ష్మి భయభ్రాంతులకు గురయ్యారు. సంపత్ కుమార్ సతీమణి స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ప్రచారం లో పాల్గొని ఇంటికొచ్చిన సంపత్ కుమారు తన సతీమణి ని 108 లో కర్నూలు కిమ్స్ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకుండా ఇంట్లోకి ఎలా వెళ్తారని సంపత్ కుమార్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో ఎలాంటి డబ్బులు దొరకపోవడంతో అధికారులు వెళ్లిపోయారు. నా నివాసానికి ఐటీ అధికారులా.. ఈడి అధికారులా తేల్చాలని సంపత్ కుమార్ స్థానిక సీఐ శివశంకర్ గౌడ్ తో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో దాడులు చేసిన అధికారులు ప్రస్తుతం కనిపించడం లేదని వారు ఎక్కడున్నారని పిలవాలని పోలీసులతో సంపత్ కుమార్ చెప్పారు. సంపత్ కుమార్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులను మీడియా వివరణ కోరగా నో కామెంట్ అని పోలీసులు తెలిపారు.




Total views : 196456