నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి నేడు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నిర్వహించనున్న విజయ్ సంకల్ప్ యాత్రను అస్సాం సీఎం ప్రారంభించనున్నారు. ఆతర్వాత భైంసాలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో సుమారు 8వేల మంది బీజేపీ కార్యకర్తల తో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. భైంసా నుంచి ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 315 కిలో మీటర్ల వరకు బస్సు యాత్ర సాగనుంది. విజయ్ సంకల్ప్ బస్సు యాత్ర లో అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అద్యక్షుడు లక్ష్మణ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ పవార్ పాల్గొంటారు.
మధ్యప్రదేశ్లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా…
నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మోదీ, చంద్రబాబు పిలుపునిచ్చిన పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు సందేశాలను ఆచరణలో చూపిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే… ఖర్చు…