Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh కోట్ల విలువ చేసే స్థలం వైసిపి నేతలపరం…

కోట్ల విలువ చేసే స్థలం వైసిపి నేతలపరం…

by Satya
కోట్ల విలువ చేసే స్థలం వైసిపి నేతలపరం…

కడప జిల్లా…నగరంలో కీలకమైన ప్రాంతం రాజారెడ్డి వీధి. జిల్లా ఎస్పీ బంగ్లా నుంచి జిల్లా గ్రంధాలయం వరకు ఈ రహదారి మంచి వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతం వ్యాపారులకు అడ్డా. ఎలక్ట్రానిక్ షోరూమ్స్ మొదలుకొని హోటల్స్..జిమ్ బ్యాంకులు.. ఇలా ఎన్నో వాటికి అడ్డా ఇది. ఇక్కడ బిజినెస్ కోసం సెంటు స్థలం దొరికితే చాలు ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటి ప్రాంతంలో సుమారు 30 సెంట్ల స్థలం.. అందులోనూ సుమారు 15 కోట్ల విలువ చేసే స్థలం కనిపిస్తే ఊరుకుంటారా , కోట్ల విలువ చేసే స్థలం వైసిపి నేతలపరం…కడప కార్పొరేషన్ లో నెంబర్-2 గా చలామణి అవుతున్న వ్యక్తి కన్ను పడితే..వ్యూహాత్మకంగా పావులు కలిపి బినామీ పేరుతో సొంతం చేసుకుంటారు. ప్రస్తుతం ఈ స్థలం వివాదాస్పదంగా మారింది.
నగరంలోని రాజారెడ్డి వీధిలో పోలీస్ పెట్రోలు బంకు సమీపంలో ఖాళీ స్థలం ఉంది. పోలీస్ శాఖ కు సంబంధించిన ఈ స్థలంపై కార్పొరేషన్ పాలకవర్గంలో నెంబర్ 2 గా ఉన్న వైసీపీ నేత కన్ను పడింది. కడప లో కరుడు కట్టిన వైసిపి నాయకులకు తెలియకుండానే ఆయన వ్యూహాత్మకంగా సుమారు 15 కోట్ల విలువ చేసే 30 సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. వివాదంలో ఉన్నప్పటికీ ఆ స్థలాన్ని అప్పటి పోలీస్ బాస్ ను మేనేజ్ చేసి మరీ ఒప్పందం చేసుకొని.. ఆ స్థలంలో తనదైన స్టైల్ లో నిర్మాణాలు కొనసాగించారు. ప్రభుత్వ మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఆ స్థలం లీజు వ్యవహారం బయట పడింది. న్యాయస్థానంలో వివాదంలో ఉన్న స్థలాన్ని అప్పటి పోలీస్ బాస్ చడి చప్పుడు కాకుండా వైసిపి నేత బినామీకి కట్టబెట్టిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది

Follow us on : Facebook, InstagramYouTube & Google News

  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
  • ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.
    పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా ‘ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్…
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.
    పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి, భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అన్ని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039129
Total views : 194371

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: