218
సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని తుని తపోవన పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అన్నారు. సీవీఆర్ న్యూస్ కు సంబంధించిన 2024 క్యాలెండర్ను సరస్వతి స్వామీజీ తపోవన పీఠంలో ప్రత్యేకంగా ఆవిష్కరించారు. తుని నియోజకవర్గానికి సంబంధించిన సీవీఆర్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ మణికంఠ మర్యాదపూర్వకంగా నూతన సంవత్సర క్యాలెండర్ ను సరస్వతి స్వామీజీకి అందజేయగా సరస్వతి స్వామీజీ ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు. తెలుగు ప్రజలకు సీవీఆర్ యాజమాన్యానికి సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తెలియజేశారు.






Total views : 78748