Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News పవన్ కళ్యాణ్ , మోహన్ లాల్ మధ్య గట్టి పోటీ

పవన్ కళ్యాణ్ , మోహన్ లాల్ మధ్య గట్టి పోటీ

by Rama
ప్యాన్ ఇండియా లెవల్లో పవన్ కళ్యాణ్ , మోహన్ లాల్ మధ్య గట్టి పోటీ

మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు -1’ విడుదల కాబోతోంది. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని AM రత్నం నిర్మిస్తున్నాడు. ఎప్పుడో పూర్తి కావాల్సినా.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో పవన్ బిజిగా ఉన్నారు. ఈ సినిమాను జనవరి వరకూ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మార్చి 28న విడుదల అని రిలీజ్ డేట్ కూడా వేశారు. అయితే ఇదే డేట్ కు ఒక్క రోజు ముందుగా 27న మరో ప్యాన్ ఇండియా మూవీ రాబోతోంది. అదే ‘ఎంపూరన్’. మళయాలంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన లూసీఫర్ కు సీక్వెల్ గా వస్తోన్న సినిమా ఇది. అక్కడి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సారి మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. లూసీఫర్ ను తెలుగులో మెగాస్టార్ హీరోగా గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేశారు. కానీ మళయాలం అంత హిట్ కాదు ఇక్కడ. ఈ సారి రీమేక్ కు ఛాన్స్ లేకుండా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారీ చిత్రాన్ని.

హరిహర వీరమల్లును కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. పవన్ కు ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది. ఇలాంటి మూవీతో మోహన్ లాల్ పోటీ పడబోతున్నాడు. అంటే.. ఇతర భాషల్లో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023057
Total views : 140804

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.