Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Latest News ప్రజలు ఆలోచించి ఓటేయాలి – మహిపాల్ రెడ్డి

ప్రజలు ఆలోచించి ఓటేయాలి – మహిపాల్ రెడ్డి

by Rama
gudem mahipal reddy

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని పటాన్ చెరులోని జీఎంఆర్ కన్వన్షన్ సెంటర్ లో నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లు కాసాని జ్ఞానేశ్వర్, భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులే మూడో సారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయన్నారు. పటాన్ చెరులో ఎమ్మెల్యే గా గూడెం మహిపాల్ రెడ్డి విజయం ఎప్పుడో ఖరారైందని, మెజార్టీయే మిగిలిందన్నారు. ఓట్ల‌ కోసం కాంగ్రెస్, బీజేపీ నుంచి కొత్త బిచ్చగాళ్లు వస్తారని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఓటడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ కే ఉందని జీఎంఆర్ చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు గణేష్ గడ్డ సిద్ది వినాయకుని వద్ద పూజలు చేసి నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

036136
Total views : 181002

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.