Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావొద్దు

కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావొద్దు

by
harish rao

కాంగ్రెస్‌కు అధికారమిచ్చి కర్ణాటక ప్రజల్లా తెలంగాణ ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. హుస్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావుమాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో ఆరు గ్యారంటీలు ఏమో కానీ ఆరు నెలలకో ముఖ్యమంత్రి పక్కాగా మారతారన్నారు. మూడు గంటల కరెంట్‌తోనే మూడు ఎకరాలు పారుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని.. రైతుబంధు ఖర్చు దుబారా అని ఉత్తమ్‌కుమారెడ్డి చెబుతున్నారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మి ఓటేస్తే మోసపోవడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో కంటే BRS మేనిఫెస్టో వందరెట్లు నయమని, పింఛను, గ్యాస్‌ సిలిండర్‌, రైతుబంధు.. ఇలా BRS ఇస్తున్న వాటినే పేర్లు మార్చి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చేర్చారన్నారు. వంద అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో ఉపన్యాసాలతో ఊదరగొట్టారని.. అధికారంలోకి వచ్చిన తరువాత అటు చూడటమే మానేశారన్నరు. వారు ఇక్కడ కూడా మళ్లీ ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

019514
Total views : 90901

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.