అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లలితమ్మ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాల ఇంటి అద్దె కరెంట్ బిల్లులు కూరగాయల బిల్లులు సకాలంలో చెల్లించాలని అన్నారు. గౌరవ వేతనాన్ని 11,500 నుంచి 16,000 చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచాలన్నారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైయస్సార్ ఎస్పీ, ఎఫ్ ఆర్ ఎస్, వైయస్సార్ మిల్క్, పోషణ ట్రాకర్ అనే మూడు యాప్లను ఒకే యాప్ గా మార్చాలన్నారు. ఈ డిమాండ్లన్నింటినీ నెరవేర్చకపోయినట్లయితే డిసెంబర్ 8వ తేదీ నుండి నిర్వాదిక సమ్మెను చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ నిరవధిక సమ్మె సమస్యలు పరిష్కారమయేంతవరకు కొనసాగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి షేక్ ఖాసిం, నియోజకవర్గ ఏఐటీయూసీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఆఫీస్ బేరర్ టీవీ రేణుక జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, అధ్యక్షురాలు నారాయణమ్మ, ధనలక్ష్మి తోపాటు తదితర అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు.
అంగన్వాడీల నిరవధిక సమ్మె…
341
previous post





Total views : 90632