Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshGuntur సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నా..

సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నా..

by
Dharna of Anganwadi workers

అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మె చేశారు. రేపల్లె ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని ఏపి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు ధర్నా చేశారు. ఈ సదర్భంగా అంగన్వాడీ వర్కర్స్, అండ్ హెల్పర్స్, యూనియన్ సీఐటీయూ ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు సిహెచ్.మణిలాల్ లు మాట్లాడుతూ సమ్మెలోకి వెళుతున్నట్లు సమ్మె నోటీసులు పలుదపాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం స్పదించకపోవటంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సినా పరిస్థితి వచ్చిందని, రోజువారి పని ఒత్తిడి పెరగటం మరియు యాప్స్ పేరుతో తీవ్రమైన ఇబ్బందులు అంగన్వాడి వర్కర్స్ పడుతున్నారు అని అన్నారు. రోజువారీ ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నవి, అయినప్పటికీ వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణా కన్నా 1000 ఎక్కవ వేతనం ఇస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేస్తుందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, లబ్ధిదారులకు అవసరమైన నాణ్యమైన ఫుడ్ సరఫరా చేయటం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పలుదఫాలు ఆందోళన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మెలో చేయలిసినా పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి అంగన్వాడీలా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014553
Total views : 80459

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.