Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh కోటి మట్టి శివలింగాలతో మహా కుంభాభిషేక ఏర్పాట్లు….

కోటి మట్టి శివలింగాలతో మహా కుంభాభిషేక ఏర్పాట్లు….

by Prakash
crores of clay Shivalingas

ఆస్ట్రేలియాకు చెందిన హిందూ ఆధ్యాత్మిక భక్తురాలు జోర్డి మూర్ హిందూ ధర్మంపై నమ్మకంతో చతురామ్నాయ పీఠాలను పాదయాత్రగా నడిచి వెళ్లాలని సంకల్పంతో 6410 కిలోమీటర్లు 8 నెలల కాలం నుంచి నడుస్తున్నటువంటి ఆమె మన ప్రాంతం మీదిగా వెళ్లడం జరుగుతుంది. ఇర్రిపాక లో జరగనున్న మహా కుంభాభిషేకానికి కోటి మట్టి శివలింగాల తయారీలో పాల్గొనడానికి సోమవరం గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు జ్యోతుల లక్ష్మీదేవి, జ్యోతుల అనీష్ నెహ్రూ, ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుండి ఆమె వెంట లక్ష్మీదేవి, అనీష్ నెహ్రూ పాదయాత్ర చేసుకుంటూ ఇర్రిపాక శివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ వేద పండితులు, జ్యోతుల మణి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మట్టి శివలింగాల తయారీలో పాల్గొని మహా కుంభాభిషేక విషయాలను లక్ష్మీదేవిని మణిని అడిగి తెలుసుకున్నారు. ఈ తయారవుతున్న కోటి మట్టి శివలింగాలతో ఇక్కడే మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని ఆ ఏర్పాట్లను ఆమెకు వివరించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మట్టి శివలింగాల తయారీలో జగ్గంపేట ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు సుమారు వందమంది పాల్గొని మట్టి శివలింగాలు తయారు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014177
Total views : 79512

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.