Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh గంటావూరులో భూ కబ్జాల పర్వం..

గంటావూరులో భూ కబ్జాల పర్వం..

by
land

పలమనేరు మున్సిపాలిటీ గంటావూరులో కబ్జాల పర్వం కొనసాగుతోంది. గంటావూరు లో కొంతమంది ప్రభుత్వ స్థలాలను అందినకాడికి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గంటావూరులో ప్రభుత్వ స్థలంలో ఓ నేత ఏకంగా సచివాలయం నిర్మిస్తున్నామంటూ ప్రజలను నమ్మబలికి రెండంతస్థుల భవనాన్ని నిర్మించాడు. మరోచోట ప్రభుత్వ లే ఔట్ స్కెచ్ లో ఉన్న రోడ్డునే ఏకంగా అమ్మేశారు. తాజాగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని హిటాచి వాహనంతో చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అక్కడకు వచ్చిన రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా తమకు తెలియదని సమాధానం చెప్పగా మీకు తెలియకుండా పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. రెవెన్యూ అధికారులు పనులను నిలిపివేశారు.

Advertisements

You may also like

Our Visitor

019388
Total views : 90632

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.