విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో అంగన్వాడి సిబ్బంది నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మద్దతు ఇచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు కలిపి అంగన్వాడి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కె.ఏ నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇస్తూ ప్రమోషన్ అమలు చేయాలని చెప్పారు. అంగన్వాడి విధులలో రాజకీయ జోక్యం అరికట్టాలని సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, చాలా నిబంధనలు అమలు చేయాలని మరియు సిబ్బందికి బీమా సౌకర్యం కలిగించాలని వ్యాఖ్యానించారు.
అంగన్వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె
258
previous post





Total views : 79725