Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh చేతగాని పరిపాలన…. రోడ్డెక్కిన అంగన్వాడీలు

చేతగాని పరిపాలన…. రోడ్డెక్కిన అంగన్వాడీలు

by Prakash
Innovative protest of Anganwadis with flowers in their ears

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎండీఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. 10వ రోజు నిరసనలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. జనసేన మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు నిరసనలో పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కేసాడు. రాష్ట్రం మొత్తం అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చెవిలో పూలు పెట్టి వాళ్లకు జీతాలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ చేతగాని పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల అంగన్వాడీలు రోడ్డెక్కి వాళ్ళని దీనస్థితికి తీసుకువచ్చారు. ఎవరైతే నీకు ఓటు వేసి గెలిపించారో వాళ్లే రేపు తిరిగి నిన్ను ఇంటికి పంపుతారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చకపోతే తగు బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉమ్మడి ప్రభుత్వం రాగానే అంగన్వాడీలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

039464
Total views : 196935

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: