Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshEast Godavari కాకినాడలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తత..

కాకినాడలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తత..

by Rama
NTR StatueNTR Statue

కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటన కాకినాడ నగరంలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాకినాడ సినిమా రోడ్లో ఉన్న సంత చెరువు కనకదుర్గమ్మ అమ్మవారి గుడి బయట శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన గుడి బయట వైసీపీకి చెందిన నాయకులు స్పీకర్లనుండి వచ్చిన కీర్తనలకు భజనలు చేపట్టారు. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. తమ అభిమాన నేత ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తుంటే దానికి మేము ఆందోళన వ్యక్తం చేయగా వైకాపా వాళ్లు పోటీగా పెద్ద శబ్దాలతో దేవుని భజనలు చేయడం అన్యాయమన్నారు. టీడీపీ, వైకాపా వాళ్లు పోటాపోటీగా నిరసన వ్యక్తం చేయగా పోలీసులు చేరుకొని ఎటువంటి వివాదాలు రాకుండా సర్ది చెప్పారు.. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ పి మురళీకృష్ణ రెడ్డి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ బి అప్పారావులతో పాటు పోలీసు సిబ్బంది వైకాపా, టీడీపీ నాయకులతో కొంతసేపు చర్చలు జరిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం లేదని పక్కకు జరుపుతున్నామని వైకాపా వారు చెప్పగా దానికి టీడీపీ వాళ్ళు అక్కడే కుడి పక్కకు మార్చాలని పట్టుబట్టారు. కొంతసేపు వాగ్వివాదం వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య జరిగింది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

Advertisements

You may also like

Our Visitor

013799
Total views : 78106

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.