Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh ఏపీలో జోకర్ పాలన..

ఏపీలో జోకర్ పాలన..

by Rama
Badeti chanti

సీఎం జగన్ రాష్ట్రంలోని ఉద్యోగులను అవహేళన చేస్తున్నారని ఏలూరు టిడిపి ఇంచార్జ్ బడేటి చంటి అన్నారు.. ఏలూరు కలెక్టరేట్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు గత 13 రోజులు గా సమ్మె చేస్తున్నారు. ఈరోజు ఈ సమ్మెలో ఏలూరు టీడీపీ ఇన్చార్జ్ బడేటి చంటి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జోకర్ పాలన సాగుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి చదువు లేని వ్యక్తి.. చదువుకున్న ఉద్యోగుల బాధ ఆయనకు తెలియదని విమర్శించారు. ప్రతిసారి ఉద్యోగులను చర్చలు పేరుతో పిలిచి అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: