Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh టీ ఒడ్డురు లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ….

టీ ఒడ్డురు లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ….

by Prakash
Clash between TDP and YCP in Tea Bank

చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ టీ ఒడ్డురు లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 3వ తేదీన టీ వడ్డూరులో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో నిన్నటి రాత్రి తెలుగుదేశం బ్యానర్లు కడుతుంటే మా ఊర్లో తెలుగుదేశం జెండా ఎగరకూడదని వైసీపీ నాయకులు టిడిపి నాయకులు పైన దాడి చేసారు. వీధిలైట్లు ఆపి 50 మందిపైనే వైసిపి నాయకులు వచ్చి టిడిపి నాయకులు పైన దాడి చేసారు. స్వతంత్ర బాబు, దొరస్వామి, వినోద్, అమర, ప్రియ అనే మహిళ తల పైన తీవ్ర గాయాలయ్యాయి. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించి మీకు నేనున్నానని వాళ్ళకి వెన్నుదట్టి ధైర్యం చెప్పారు. వైసీపీకి పోయే కాలం వస్తేనే ఇటువంటి బుద్ధి పుడుతుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013925
Total views : 78456

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.