వాసుదేవానంద నగర్ శ్రీ దండాయుధ పాణి స్వామి వారి దేవస్థానం లో నిర్వహిస్తున్న చండీ సహిత అతిరుద్ర మహా యజ్ఞంలో సి వి ఆర్ గ్రూప్ చైర్మన్ చలసాని వెంకటేశ్వరరావు ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వాసుదేవానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరావు అనంతరం శ్రీ దండాయుధ పాణి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం లేదని, పలనిలో ఉన్న ఆలయాన్ని మించి తెలుగు గడ్డపై మైలవరం శ్రీ వాసుదేవానంద నగర్ లో నిర్మించడం చాలా ఆనందదాయకమని స్వామివారి ఆలయంలో జరిగే చండీ సహిత అతిరుద్ర మహా యజ్ఞం చూడడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఉభయ తెలుగు ప్రజలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
తుమ్మలని మహా యజ్ఞానికి ఆహ్వానించిన సి వి ఆర్ గ్రూప్ చైర్మన్…
279
previous post






Total views : 78446