Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh సామాజిక సాధికార యాత్ర కొత్త అధ్యాయానికి నాంది…

సామాజిక సాధికార యాత్ర కొత్త అధ్యాయానికి నాంది…

by Prakash
Social empowerment bus trip

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం లో సామాజిక సాధికార బస్సు యాత్రలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం మోపిదేవి వెంకటరమణ మీడియా తో మాట్లాడుతూ సామాజిక సాధికార యాత్ర కొత్త అధ్యాయానికి నాంది పలికిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ది అని ఆయన అన్నారు. కొన్ని సామాజిక వర్గాల వారికి సమన్వయ న్యాయం జరుగుతుందని దానికి సామాజిక సాధికార బస్సు యాత్ర నిదర్శనమని, జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అభివృద్ధిని ఈ సామాజిక సాధికార యాత్ర ద్వారా స్వాగతిస్తున్నారని, ప్రతి పేదవాడు తన కాళ్ళ మీద తాను నిలబడాలని, రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలు పట్టం కడతారని ఆయన అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి లబ్ది దారుడు లబ్ది పొందారని, రేపు 2024 ఎలక్షన్స్ లో తిరిగి రెండో పర్యాయం జగన్ సీఎం అయితేనే అణగారిన వర్గాలకు, అనాగరిక వర్గాల వారికి న్యాయం జరుగుతుందని మోపిదేవి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మాట్లాడుతూ కొంత మంది పెట్ ఆర్టిస్టులు చెప్పే మాటలు నమ్మవద్దని 27 ఎస్సీ పధకాలు ఏమి రద్దు కాలేదని అందులో రాజోలు నియోజకవర్గంలో 939 మందికి లబ్ధి చేకురుందని, ప్రతి సంవత్సరం చేయూత ఆసరా పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు 18750/- రూపాయలు లబ్ది పొందారని, నిజమైన పేదవాడికి లబ్ది చేకూరాలని, అది జగన్ మోహన్ రెడ్డి ద్వారా సాధ్యమని, కొంత మంది ఆర్టిస్టులు ఎన్ని అబద్ధాలు చెప్పిన అవి చెల్లవని ఎమ్మెల్యే రాపాక అన్నారు. మోపిదేవి, విశ్వరూప్ మాట్లాడుతున్నటు వంటి సభా ప్రాంగణం నుండి సభ జరుగుతున్న మధ్యలో మహిళలు లెగిసి వెళ్లిపోవడంతో సభా ప్రాంగణం అంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తుంది.

Advertisements

You may also like

Our Visitor

013938
Total views : 78558

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.