Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు…

పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు…

by Prakash
Darishi DSP Ashok Vardhan Reddy

ప్రకాశం జిల్లా దరిశి పోలీసు స్టేషన్ లో అర్ధరాత్రి సమయంలో షేక్ బాజీ అనే యువకుడు వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పై దరిశి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి వివరాలు వెల్లడించారు కొద్దిరోజుల క్రితం మోటార్ సైకిల్ దొంగతనంలో గస్తీ కాస్తున్న పోలీసులకు ఓ మోటార్ సైకిల్ దొరకడంతో దానిని స్టేషన్లో ఉంచామని షేక్ బాజీ గత అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి స్టేషన్ కు వచ్చి మోటార్ సైకిల్ తన తమ్ముడిదని ఇవ్వాలని కోరగా రేపు ఉదయం పూట రావాలి అని సిబ్బంది తెలిపారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిన షేక్ బాజీ ఒంటిపై పెట్రోల్ పోసుకొని స్టేషన్ లోకి వచ్చి తానే నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రింకు తరలించి అక్కడి నుంచి గుంటూరు తరలించారు షేక్ బాజీ పలుమార్లు ఇదే తరహాగా స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని దరిశి డీఎస్పీ వెల్లడించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039268
Total views : 195400

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: