Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home TelanganaKhammam తుంబూరు గ్రామంలో విషాదం..

తుంబూరు గ్రామంలో విషాదం..

by Rama
Bike accident

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో విషాదం నెలకొంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని జహీర్ అనే వ్యక్తి మృతి చెందాడు. జహీర్ గ్రామంలోని సొసైటీలో క్రాప్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం కందుకూరు వెళ్లి బైక్ పై రాత్రి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. రాత్రి 10 గంటల తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జహీర్ కు ఫోన్ చేసిన స్పందించలేదు. వేంసూరు మండలం కందుకూరు గ్రామ శివారు రోడ్డు ప్రమాదానికి గురై జహీర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో జహీర్ కుటుంబంలో, తుంబురు గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డుపై వడ్లు ఆరబోసి ఉండటం తో వాటిని తప్పించే క్రమం లో ఎదురుగా వచ్చిన వాహనం జహీర్ ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేంసూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

020216
Total views : 92509

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.