Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Crime పండగ పూట… బోల్తా పడిన బస్సు

పండగ పూట… బోల్తా పడిన బస్సు

by Prakash
The Olvo bus went out of control and overturned and short circuited

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఓల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడి షార్ట్ సర్క్యూట్కు గురైంది. ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలు సజీవ దహనం కాగా మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దాదాపుగా 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి కడపకు బయలుదేరిన ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు తెల్లవారుజామున 3 గంటల సమయంలో బీచుపల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తూ బయటపడే ప్రయత్నాలు చేసే లోపే సర్క్యూట్తో బస్సు మంటల్లో కూరుకుపోయింది. ప్రమాదం నుండి ప్రయాణికులు ప్రయత్నాలలో ఓ మహిళ ప్రయాణికురాలు అందులోనే చిక్కుకొని సజీవ దహనం అయ్యింది. మరో 12 మంది గాయాలపాలు అయ్యారు. పెట్రోలింగ్ సిబ్బంది, సమీపంలో ఉన్న మరికొంత మంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisements

You may also like

Our Visitor

039238
Total views : 194921

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: