318
కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మిపురంలో వెలసిన శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గమ్మ జన్మదినం సందర్భంగా కౌన్సిలర్ మణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ మరియు ఆయన సతీమణి దుర్గమ్మ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగనన్నతో జనం – భరతన్న తో మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు పసుపు, కుంకుమ మరియు సారెను అందజేశారు. రాబోయే ఎన్నికల్లో భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, కౌన్సిలర్లు మణి, సోము శేఖర్ మరియు వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




Total views : 79413