Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh ప్రజలు మెచ్చే పాలన…

ప్రజలు మెచ్చే పాలన…

by Prakash
Minister Ponnam Prabhakar in thirumala temple

తిరుమల శ్రీవారిని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కలియుగ వెంకటేశ్వర స్వామి అన్ని కోర్కెలను తీర్చాడని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలు కోరుకున్నట్లు గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా పాలన జరగలేదని ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా పాలనను కోరుకుంటున్నారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ప్రజా పాలన, ప్రజలు మెచ్చే పాలన కొనసాగే విధంగా నడుచుకుంటుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూరాబాద్ లో శ్రీవారి దేవాలయం నిర్మాణం చేయాలని టీటీడీని కోరాలని భావించాను. టిటిడి ఈఓ చైర్మన్ అందుబాటులో లేని కారణంగా అడగలేదని హుజూరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి స్థల సమీకరణ చేస్తామని టీటీడీ ఆలయాన్ని నిర్మించి ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రిని కూడా అడుగుతామని అన్నారు. విభజన సమయంలో… విభజన అనివార్యమైనప్పుడు కచ్చితంగా ఏపీని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది దానికి కట్టుబడి ఉంటుందని, కచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013693
Total views : 77959

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.