Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra PradeshChittoor శ్రీవారి సేవకు ముస్లిం భక్తుల ఆసక్తి..

శ్రీవారి సేవకు ముస్లిం భక్తుల ఆసక్తి..

by Rama
TTD

శుక్రవారం ఉదయం తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చిన ఈఓ ధర్మారెడ్డి భక్తులు సూచించిన సలహాలు తీసూన్నారు. శ్రీవారి సేవలో పాల్గొనాలని ముస్లీం భక్తులు కోరడం సంతోషంగా ఉందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ముస్లీం భక్తులు శ్రీవారి సేవకు వచ్చేలా సాధ్యాసాధ్యాలు పరిశీలించి.. అన్యమతస్థులైన వారు శ్రీవారి సేవకు రావాలనుకున్న వారి కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సూచించారు. ఇప్పటికే నిర్మాణం అయిన క్యూలైన్ లు భక్తుల రద్దీ సమయంలో సరిపోకపోవడంతో మరో క్యూలైన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ. 15 కోట్లతో శిలాతోరణం వరకు క్యూలైన్ల ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు సిలిండర్ల ద్వారా తిరుమలలో గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడానికి సాద్యాసాద్యాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. రేపటి నుండి మూడు రోజులపాటు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక జనవరి మాసంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 21.09 లక్షలని వెల్లడించారు. కానుకల రూపంలో హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.116.46 కోట్లని తెలిపారు. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.03 కోట్లన్నారు. 46.46 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని.. 7.05 లక్షల మంది భక్తులు తలనీలాలు

Read Also..

Advertisements

You may also like

Our Visitor

019365
Total views : 90559

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.