Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra PradeshVishakapattanam విశాఖ శారదాపీఠంలో రధసప్తమి వేడుకలు

విశాఖ శారదాపీఠంలో రధసప్తమి వేడుకలు

by Rama
saradapeetam

శారదాపీఠం (Saradapeetam):

రధసప్తమి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠంలో సూర్యారాధన నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి సూర్య భగవానుడిని ఆరాధిస్తూ విశేష పూజలు చేపట్టారు. భక్తులకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్ధిస్తూ పండితులు త్రిచ సహిత అరుణ పారాయణ, ఆదిత్య హృదయం పారాయణ నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారములను ప్రదర్శించారు. మరోపక్క విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు రెండో రోజు కూడా కొనసాగాయి. రాజశ్యామల అమ్మవారి ప్రత్యేక అలంకరణకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు హారతులిచ్చారు. లోక కళ్యాణార్ధం చేపట్టిన మహారుద్ర సహిత రాజశ్యామల యాగాన్ని పర్యవేక్షించారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: