ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల అధిష్టానంతో ఆశావాహులు భేటీ అవుతున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన గంటా శ్రీనివాస రావు విశాఖ టీడీపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై గంటా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే నేడు తన సన్నిహితులు, అనుచరులతో గంటా శ్రీనివాస రావు భేటీ కానున్నారు. సమామేశం అనంతరం ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.